E-Paper
Advertisement

Housemaid Mix Urine : జ్యూస్ లో మూత్రం.. పనిమనిషి నిర్వాకం.. ఎలా తెలిసిందంటే..

Housemaid Mix Urine : జ్యూస్ లో మూత్రం.. పనిమనిషి నిర్వాకం.. ఎలా తెలిసిందంటే..
Advertisement

Housemaid Mix Urine | యజమాని కోసం తయారు చేసే ఫ్రూట్ జ్యూస్ లో ఓ పనిమనిషి తన మూత్రం కలిపింది. పైగా ఆ ఇంటి యజమాని ఓ రాజకీయ నాయకుడట. ఈ ఘటన ఒక వీడియోలో రికార్డ్ కావడంతో బయటపడింది. పైగా ట్విట్టర్ లో ఒక యూజర్ ఈ వీడియోని షేర్ చేయగా.. ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. బాబా బనారస్ అనే ట్విట్టర్ యూజర్ తాజాగా ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో ఇద్దరు పనిమనుషులు ఒక ఇంటి కిచెన్ లో పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ముందు అంతా సవ్యంగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నా.. కాసేపు తరువాత ఒక షాకింగ్ దృశ్యం కనిపించింది. ముందుగా ఒక పనిమనిషి ఇంటి యజమాని కోసం ఒక గ్లాసులో పండ్ల రసం తయారు చేయగా.. వెనుక ఉన్న రెండో పనిమనిషి ఇదంతా గమనిస్తూ ఉంటుంది.

Advertisement

ముందు ఉన్న పనిమనిషి జ్యూస్ తయారు చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు వెనుక పంజాబీ డ్రెస్సులో నిలబడి ఉన్న రెండో పనిమనిషి ఒక ఖాళీ గ్లాసులో తన మూత్రం నింపి.. దాన్ని జ్యూసి వేసేస్తుంది. ఆ తరువాత ఏమీ ఎరుగనట్లు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే ఈ దృశ్యాలు జ్యూస్ పెట్టిన స్థలంలోనే వెనుక రహస్యంగా ఉన్న కెమెరాలో రికార్డ్ అవుతున్నట్లు ఆమె గమనించలేదు.

Also Read:  టిండర్ యాప్‌లో స్వలింగ సంపర్కుల డేటింగ్.. కిడ్నాప్ చేసి దోపిడి

Advertisement

ఈ వీడియో పోస్ట్ చేసిన బాబా బనారస్ అనే ట్విట్టర్ యూజర్ మాత్రం.. ఆమె ముస్లిం కాబట్టే ఇలా చేసిందని మత విద్వేషంగా పోస్ట్ పెట్టడం మరో విశేషం. ఆ పనిమనిషి పేరు ఫరీదా ఖతూన్ అని.. ఇంటి యజమాని ఒక సమాజ్ వాదీ పార్టీ నాయకుడని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇంటి యజమాని ఒక హిందూ కాబట్టే ఇలా చేసిందని రాసుకొచ్చాడు. అందుకే పనిమనిషిని నియమించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని రాశాడు.

ఈ పోస్ట్ చూసి చాలామంది నెటిజెన్లు రియాక్ట్ అవుతున్నారు. ముస్లింలంతా ఇలాంటి వారేనని ద్వేష పూరితంగా కామెంట్లు చూస్తున్నారు. మరికొందరైతే ఆమె బంగ్లాదేశీ లేదా రోహింగ్యా ముస్లిం శరణార్థి కావచ్చునని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పోస్ట్ గురించి ఫ్యాక్ట్ చెక్ ఇంతవరకూ జరగలేదు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి కానీ.. ఏ జాతీయ న్యూస్ మీడియా చానెల్ దీన్ని ధృవీకరించలేదు.

ఇలాంటిదే మరో ఘటన కొన్ని నెలల క్రితం అంటే అక్టోబర్ 2024లో ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో ఒక వ్యాపారి ఇంట్లో రీనా అనే పనిమనిషి చపాతీ పిండిలో నీరు కలపకుండా తన మూత్రాన్ని కలిపి వంట చేస్తూ పట్టుబడింది. ఆ ఇంటి యజమాని ఒక బడా వ్యాపారి. ఈ ఘటనకు కొన్ని రోజుల క్రితం నుంచి వ్యాపారి ఇంట్లో అందరూ అనారోగ్యానికి గురయ్యేవారు. అందరికీ లివర్ ఇన్‌ఫెక్షన్ సోకింది. డాక్టర్ల వద్ద చికిత్స తీసుకుంటున్నా.. ఇన్‌ఫెక్షన్ తగ్గకపోవడంతో డాక్టర్లు తినే ఆహారంలోనే ఏదో పొరపాటు జరుగుతోందని ఆ వ్యాపారికి సూచించారు. దీంతో ఆ వ్యాపారి తన ఇంట్లోని వంటగదిలో రహస్యంగా ఒక కెమెరా పెట్టగా.. పనిమనిషి నిర్వాకం బయటపడింది.

వీడియో ఆధారంగా పోలీసులు పనిమనిషి రీనాని అరెస్టు చేసి ఆమెపై కేసు నమోదు చేశారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×