E-Paper

గోల్డ్ షాప్‌లోకి చొరబడి.. పెప్పర్ స్ప్రే కొట్టి.. యువతులు వీరంగం!

గోల్డ్ షాప్‌లోకి చొరబడి.. పెప్పర్ స్ప్రే కొట్టి.. యువతులు వీరంగం!
Advertisement

Patna Robbery: బిహార్ రాజధాని పాట్నాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు పెప్పర్ స్ప్రేను ఉపయోగించి.. షాపులో నగలు దోచుకెళ్లడానికి ప్రయత్నించారు. షాపు యజమాని చాకచక్యంగా వ్యవహరించడంతో వారు అడ్డంగా బుక్కయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పాట్నాలోని దిగా ప్రాంతంలో గల నగల దుకాణానికి మాస్కులు ధరించిన ఇద్దరు యువతులు వెళ్లారు. యజమానితో గోల్డ్ చూపిస్తుండగా.. వారిలో ఒక యువతి ఒక్కసారిగా పెప్పర్ స్ప్రేను బయటకు తీసింది. దానిని యజమాని ముఖంపై కొట్టి.. బంగారంతో పారిపోవాలని భావించారు. అయితే యజమాని చాకచక్యంగా వ్యవహరించి.. బిగ్గరగా కేకలు వేశాడు. బయటకు వెళ్లి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. దీంతో తప్పించుకునే అవకాశం లేక.. యువతులు షాపులోనే ఉండిపోయారు.

Advertisement

Also Read: చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక ఆధారమైన కుక్క మృతి

Advertisement

ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 5.35 గం.ల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. షాపులోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఇద్దరు యువతులపై షాపు యజమాని ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇలాంటి దొంగతనాలకు ఏమైనా పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అయితే మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన పెప్పర్ స్ప్రేను ఇలా దోపిడికి ఉపయోగించడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Also Read: భర్తతో విడిపోయిన తర్వాత దారుణమైన ట్రోల్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బాలీవుడ్ బ్యూటీ!

Related News

బాస్ జేబుకు రూ. 2.5 లక్షల చిల్లు పెట్టిన ఎంప్లాయ్.. జెరోధా ఆఫీస్‌లో జరిగిన క్రేజీ స్టోరీ

లైవ్ రిపోర్టర్‌కు ముద్దు పెట్టిన యువతి.. సోషల్ మీడియాలో హాట్ డిబేట్!

రీల్స్ పిచ్చి కొంపముంచింది.. పక్కా ప్లాన్‌తో 10 లక్షలు లేపేసిన దొంగలు!

ఒక్క రోజుకే 35 కోళ్లు, 90 కేజీల బియ్యం.. ఈ ఫ్యామిలీ రేషన్ లిస్ట్ చూస్తే షాక్ అవుతారు!

బిర్యానీలో ఈగ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోర్టు తీర్పు ఇదే!

జేబులో బాంబులా పేలిన స్మార్ట్‌ఫోన్.. షాకింగ్ వీడియో చూస్తే ఇక జేబులో ఫోన్ పెట్టరు!

నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఆలయ ఏనుగు వీడియో.. ఏం చేసిందంటే?

Big Stories

×