E-Paper
Advertisement

చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక ఆధారమైన కుక్క మృతి

చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక ఆధారమైన కుక్క మృతి
Advertisement

Girl Missing Case: కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఊహించని మలుపు తీసుకుంది. ఈ కేసులో కీలక ఆధారంగా ఉన్న పెంపుడు కుక్క.. అకస్మాత్తుగా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నారి కోసం గాలించే క్రమంలో పోలీసులు.. ఈ శునకానికి జీపీఎస్ ట్రాకర్ ను అమర్చారు. ఈ క్రమంలో 80 నిమిషాల వ్యవధిలో 8 కి.మీ మేర తిరిగిన ఈ కుక్క.. ఇంటికి తిరిగొచ్చి ఒక్కసారిగా కుప్పకూలింది.

అయితే శునకం శుక్రవారం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదని జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైగా అడవిలోకి పంపేందుకు అధికారులు ప్రయత్నించినా.. అది వెళ్లలేదని పేర్కొంటున్నారు. కాగా మరణానికి ముందు కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఓ బోనులో ఉన్న కుక్క.. కనీసం నిలబడలేకపోయింది. కాళ్లు వణుకుతున్న స్థితిలో కనిపించింది. ఆహారం, నీరు పెట్టినప్పటికీ అది తినలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే కుక్క సహజంగా మరణించిందా? మరో కారణం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు ప్రస్తుతం కలుగుతున్నాయి.

Advertisement

Also Read: ఫ్రిజ్‌లో పెట్టినా కూరగాయలు పాడవుతున్నాయా? మీరు చేసే ఆ చిన్న తప్పే కారణం!

కేసులో ఎంతో కీలకంగా ఉన్న కుక్క.. ఇలా అర్ధంతరంగా మరణించడం ఏంటన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. ఇప్పుడు జ్ఞానేశ్వరి జాడను పోలీసులు ఏ విధంగా కనిపెడతారన్న ఉత్కంఠ స్థానికుల్లో మెుదలైంది. కుక్క లేకుండా పాపను పట్టుకోవడం పోలీసులకు అతిపెద్ద సవాలు కానుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. కాగా గత శనివారం ఇంటివద్ద ఆడుకుంటున్న జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయింది. బాలికతో పాటు అదృశ్యమైన శునకం మంగళవారం తిరిగొచ్చింది. దాని సాయంతో పాప ఆచూకి కనుగొనాలని భావిస్తున్న పోలీసులకు కుక్క మృతితో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు.

Advertisement

Also Read: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్.. షోకాజ్ నోటీసులు జారీ

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Big Stories

Advertisement
×