Viral Video: ప్రయాణికులకు ఎన్ని రైళ్లు వేసినా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఫెస్టివల్ సీజన్ అయితే చెప్పనక్కర్లేదు. వెయిటింగ్ లిస్టు జాబితా పెద్దదిగా ఉంటుంది. టిక్కెట్ దొరక్క చివరకు చాలామంది జనరల్ బోగీల్లో ట్రావెల్ చేస్తున్నారు. ఒక్కోసారి వారిని ఊహించని అనుభవం ఎదురవుతుంది.
రైలులో సీటు కోసం ఏం జరిగింది?
సమయం, ఎప్పుడు, ఎక్కడ అనేది కాసేపు పక్కన బెడదాం. రైలులోని జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల మధ్య ఫైటింగ్ జరిగింది. దాదాపు అరగంటపాటు మహిళలు కొట్టుకున్నారు. జట్టు పట్టుకుని కింద పడేసి మరీ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇద్దరు మహిళలు కావడంతో విడిపించడానికి ఏ ఒక్కరూ అడుగు వేయలేకపోయారు.
మహిళల మధ్య గొడవను సినిమా చూసినట్టు అందులో ప్రయాణికులు చూశారు. అందులో ఓ వ్యక్తి గొడవ తతంగాన్ని తన ఫోన్ ద్వారా చిత్రీకరించాడు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అది విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఒకప్పుడు సీట్ల కోసం పురుషులు కొట్టుకునేవారని, ఇప్పుడు మహిళల వంతైందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇద్దరు మహిళలు కుమ్మేసుకున్నారు, వీడియో వైరల్
ప్రయాణికుల కోసం రైల్వే ఎన్నిరైళ్లు వేసినా ఇదే రష్ కంటిన్యూ అవుతోందని అంటున్నారు. ఇలాంటి వీడియోలు తీసి వైరల్ చేయడం వల్ల రైల్వేకు చెడ్డ పేరు వస్తుందని మరికొందరు అంటున్నారు. ఫెస్టివల్ సీజన్లో రైళ్లలో ఇలాంటి గొడవలు జరగకుండా ఉండాలంటే కచ్చితంగా ఓ పోలీసును ఏర్పాటు చేయాలని అంటున్నారు మరికొందరు ప్రయాణికులు.
రైలు ప్రయాణాల్లో సీట్ల కోసం గొడవలు సర్వసాధారణం, కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీటు విషయంలో తలెత్తిన వివాదంతో ఇద్దరు మహిళలు ఏకంగా జుట్టు పట్టుకొని, కిందపడి మరీ కొట్టుకున్నారు. అక్కడున్న పురుషులు వారిని వారించేందుకు… pic.twitter.com/o0isCyJYL8
— ChotaNews App (@ChotaNewsApp) February 2, 2026