Jagan-KTR Photo: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెంగళూరులో ఒకే వేదికపై కలుసుకోవడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. శనివారం సాయంత్రం బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పక్కపక్కనే కూర్చొని కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల తెలంగాణలో కేసీఆర్ పాలనపై, హైదరాబాద్ అభివృద్ధిపై జగన్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. వీరిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని, రాజకీయాలకు సంబంధించినది కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
బెంగళూరులో జగన్, కేటీఆర్ ఆత్మీయ కలయిక
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెంగళూరులో ఒకే వేదికపై కలుసుకోవడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. pic.twitter.com/wRsZm9wAcY
— vm_updates (@VijayMarka88) November 22, 2025