E-Paper
Advertisement

Elephant Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

Elephant Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి
Advertisement

Elephant Attack: వారంతా పుణ్యం కోసం వెళ్లారు.. కానీ మృత్యువు వారిని వెంటాడింది.. వేటాడింది.. దీంతో వారి కుటుంబాల్లో మిగిలింది తీరని ఆవేదనే.. ఎవరూ తీర్చలేని లోటే. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలో ఘోర విషాదం జరిగింది. వై కోట సమీపంలోని గుండాల కోనలో ఉన్న ఈశ్వరుడి దర్శనానికి బయలుదేరిన శివయ్య భక్తులపై గజరాజులు విరుచుకుపడ్డాయి. భక్తులపై ఏనుగుల మంద దాడితో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతులు ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వారు. గాయపడిన వారిని రైల్వే కోడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం వై కోట సమీపంలో గుండాల కోనలో  శివుడి ఆలయం ఉంది. బుధవారం మహా శివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శివయ్యను దర్శించునకునేందుకు బయల్దేరారు. మార్గమద్యలో ఏనుగులు వారిపై దాడి చేశాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతి చెందిన వారు  ఒకే కుంటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది.

Advertisement

కాగా గుండాల కోనలో ఉన్న మల్లేశ్వరాలయంలో మహాశివరాత్రిని స్థానిక ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. మంగళవారం నాడు ఐదువేల మందికి అన్న దానం ఏర్పాట్లు చేశారు. ఈ తరుణంలో ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు దాడి చేశాయి.

ఇక ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ముగ్గురు మృతి చెందడం బాధాకరం అన్నారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌ను వై.కోటకు వెళ్లాలని పవన్ ఆదేశించారు. అసెంబ్లీ నుంచి హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాలన్నారు. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని అటవీ శాఖ అధికారులకు పవన్ ఆదేశించారు.

Advertisement

Also Read: కేరళలో దారుణం.. గంటల వ్యవధిలో 5 హత్యలు చేసిన యువకుడు

కాగా అదే ప్రాంతంలో గత కొంత కాలంగా ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాదోంళనకు గురిచేస్తున్నాయి. చిత్తూరు, అన్నమయ్యజిల్లాలో సంచరిస్తున్న ఏనుగులు చేతికొచ్చిన పంటను నాశనం చేస్తున్నాయి. గ్రామ శివారులో ఉన్న ఇళ్లను, వాహనాలను, మనుషులపై దాడి చేస్తూ.. గ్రామస్థులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×