BigTV English
Advertisement

Elephant Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

Elephant Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

Elephant Attack: వారంతా పుణ్యం కోసం వెళ్లారు.. కానీ మృత్యువు వారిని వెంటాడింది.. వేటాడింది.. దీంతో వారి కుటుంబాల్లో మిగిలింది తీరని ఆవేదనే.. ఎవరూ తీర్చలేని లోటే. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలో ఘోర విషాదం జరిగింది. వై కోట సమీపంలోని గుండాల కోనలో ఉన్న ఈశ్వరుడి దర్శనానికి బయలుదేరిన శివయ్య భక్తులపై గజరాజులు విరుచుకుపడ్డాయి. భక్తులపై ఏనుగుల మంద దాడితో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతులు ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వారు. గాయపడిన వారిని రైల్వే కోడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం వై కోట సమీపంలో గుండాల కోనలో  శివుడి ఆలయం ఉంది. బుధవారం మహా శివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శివయ్యను దర్శించునకునేందుకు బయల్దేరారు. మార్గమద్యలో ఏనుగులు వారిపై దాడి చేశాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతి చెందిన వారు  ఒకే కుంటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది.

కాగా గుండాల కోనలో ఉన్న మల్లేశ్వరాలయంలో మహాశివరాత్రిని స్థానిక ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. మంగళవారం నాడు ఐదువేల మందికి అన్న దానం ఏర్పాట్లు చేశారు. ఈ తరుణంలో ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు దాడి చేశాయి.


ఇక ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ముగ్గురు మృతి చెందడం బాధాకరం అన్నారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌ను వై.కోటకు వెళ్లాలని పవన్ ఆదేశించారు. అసెంబ్లీ నుంచి హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాలన్నారు. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని అటవీ శాఖ అధికారులకు పవన్ ఆదేశించారు.

Also Read: కేరళలో దారుణం.. గంటల వ్యవధిలో 5 హత్యలు చేసిన యువకుడు

కాగా అదే ప్రాంతంలో గత కొంత కాలంగా ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాదోంళనకు గురిచేస్తున్నాయి. చిత్తూరు, అన్నమయ్యజిల్లాలో సంచరిస్తున్న ఏనుగులు చేతికొచ్చిన పంటను నాశనం చేస్తున్నాయి. గ్రామ శివారులో ఉన్న ఇళ్లను, వాహనాలను, మనుషులపై దాడి చేస్తూ.. గ్రామస్థులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Related News

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Big Stories

×