E-Paper
Advertisement

YSR Cheyutha Funds : 14 రోజుల ఉత్సవం.. నేడు నాల్గవ విడత వైఎస్సార్ చేయూత నిధులు విడుదల

YSR Cheyutha Funds : 14 రోజుల ఉత్సవం.. నేడు నాల్గవ విడత వైఎస్సార్ చేయూత నిధులు విడుదల
Advertisement
CM Jagan to Release YSR Cheyutha Funds
4th phase of ysr cheyutha funds release

CM Jagan to Release YSR Cheyutha Funds Today(ap political news) : చేతివృత్తులు, చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని.. తమ కాళ్లమీద తాము బ్రతికేలా మహిళలకు చేయూతను అందిస్తోన్న పథకం వైఎస్సార్ చేయూత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల జీవనోపాధుల నిమిత్తం.. 26 లక్షల 98 వేల 931 మంది మహిళల ఖాతాల్లో.. ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున నేడు నాలుగవ విడత ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఏపీ వ్యాప్తంగా 45-60 ఏళ్ల మధ్యనున్న మహిళల ఖాతాల్లోకి ఈ నిధులు జమ కానున్నాయి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల మహిళలు శాశ్వత జీవనోపాధిని పొందేలా .. 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకూ 3 విడతలుగా ఒక్కో విడతలో రూ.18,750 చొప్పున ప్రతి అర్హురాలైన మహిళకు రూ.56,250 చొప్పున నిధులు అందించింది. నాల్గవ విడత నిధులతో మొత్తం రూ.75 వేల సాయం అందుతుంది. ఈ ఒక్క పథకం ద్వారానే వైసీపీ ప్రభుత్వం రూ.19,189.60 కోట్లను మహిళలకు అందించినట్లు అవుతుంది.

Advertisement

Read More : నేడు ఢిల్లీకి చంద్రబాబు.. పొత్తుల లెక్కలు తేలుతాయా ?

సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లా పిసినికాడలో బటన్ నొక్కి నాల్గవ విడత వైఎస్సార్ చేయూత నిధులను విడుదల చేస్తారు. నేటి నుంచి 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మండలాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వైఎస్సార్ చేయూత నిధుల పంపిణీ జరుగుతుంది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన మహిళల్లో 16 లక్షల 55 వేల 591 మంది మహిళలు వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభించి స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు.

Advertisement

నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి అనకాపల్లి జిల్లా కశింకోటకు చేరుకుంటారు. అక్కడి నుంచి పిసినికాడ వెళ్లి.. నాల్గవ విడత వైఎస్సార్ చేయూత నిధులను బటన్ నొక్కి విడుదల చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×