E-Paper
Advertisement

Festival Special Trains: అనకాపల్లికి ప్రత్యేక రైళ్లు, పండుగ సీజన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!

Festival Special Trains:  అనకాపల్లికి ప్రత్యేక రైళ్లు, పండుగ సీజన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!
Advertisement

SCR Festival Special Trains:  

దసరా, దీపావళి, ఛత్ పూజ లాంటి పండుగలు వరుసగా వస్తున్న నేపథ్యంలో ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ఇండియన్ రైల్వే జాగ్రత్తలు తీసుకుంటుంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇక తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే కూడా పండుగ సీజన్ కు అనుగుణంగా స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా తాజాగా కీలక ప్రకటన చేసింది.

కాచిగూడ – అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు     

పండుగ సీజన్‌లో ప్రయాణీకుల రాకపోకలను సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు, కాచిగూడ-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు గురువారాలు, శుక్రవారాల్లో నడుస్తాయని తెలిపింది.

పండుగ ప్రత్యేక రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?

Advertisement

ఇక ఫెస్టివల్ స్పెషల్ రైళ్లు కాచిగూడ-అనకాపల్లి మధ్య పలు స్టేషన్లలో ఆగేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మల్కాజ్‌ గిరి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రితో సహా ప్రధాన స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ రైళ్లు ఫస్ట్ AC నుంచి జనరల్ సెకండ్ క్లాస్ వరకు వివిధ తరగతులను అందిస్తాయి.

చర్లపల్లి-  హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైళ్లు

పండుగ సీజన్ లో అక్టోబర్ 7, 8, 16, 17 తేదీలలో చర్లపల్లి-  హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు కాజీపేట, నాగ్‌ పూర్, భోపాల్, ఝాన్సీ,  ఆగ్రా కాంట్ లాంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో ఫస్ట్ AC నుంచి స్లీపర్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణీకులకు సేవలు అందిస్తాయి.

Advertisement

Read Also: హైదరాబాద్ లో నాలుగు లైన్ల రైలు మార్గం, అమ్మో అన్ని లాభాలా?

దేశ వ్యాప్తంగా 12 వేల ప్రత్యేక రైళ్లు 

తాజాగా దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయాల కారణంగా పండుగ ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందే అవకాశం ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే నెట్‌ వర్క్‌ లో రద్దీని తగ్గించడం లక్ష్యంగా ఈ చర్చలు చేపట్టింది. ఇక ఈ పండుగ సీజన్ లో దేశ వ్యాప్తంగా 12 వేల ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని రద్దీకి అనుగుణంగా ఈ రైళ్లను నడిపించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రయాణీకులు ఈ రైళ్లను ఉపయోగించుకుని ఇబ్బంది లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని వైష్ణవ్ సూచించారు.

Read Also: రైల్వే వ్యాగన్లలో బొగ్గు తరలించేటప్పుడు నీళ్లు చల్లుతారు, ఎందుకో తెలుసా?

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×