E-Paper
Advertisement

Annamaya District: అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత.. గుప్త నిధుల కోసమేనా?

Annamaya District: అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత.. గుప్త నిధుల కోసమేనా?

Abhayanjaneya Swamy temple in Annamaya: గుప్త నిధుల కోసం కొంతబంది దుండగులు ఓ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఏకంగా అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చి వేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలో గుప్త నిధుల కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం 16వ శతాబ్ధంలో నిర్మించిన కనుగొండ రాయస్వామి ఆలయానికి సమీపంలో ఇటీవల ఓ బండపై అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కి ఆలయం నిర్మించారు. అయితే ఈ ఆలయాన్ని కొంతమంది ధ్వంసం చేశారు.

ములకలచెరువులో గ్రామానికి కాస్త దూరంగా శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం ఉంది. దీనిని కొంతమంది గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అయితే పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించడంతోపాటు గేట్లు ధ్వంసం చేశారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్పీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, గుప్త నిధుల కోసం ఇలా చేసి ఉంటారేమోనని సీఐ రాజా రమేశ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఆలయాన్ని కూలగొట్టిన దుండగులను వెంటనే చట్ట ప్రకారం శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ఆదేశించాడు.

ఇదిలా ఉండగా, గతంలోనూ ఇలాగే ఓ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఆలయం సమీపంలో బండ్లపై చెక్కిన అభయాంజనేయ స్వామి కళ్లకు గంతలు కట్టి గుప్తనిధులు కోసం తవ్వకాలు జరిపిన ఘటన కలకలం రేగింది. అయితే ఏడాది కిందట ఓ బండపై అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించడంతోపాటు విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు స్థానికులు చెబుతున్నారు.

కొంతమంది దుండగులు కావాలనే దాడి చేశారని, సుత్తి, గడ్డపార సహాయంతో గోడను కిందిభాగంలో ధ్వంసం చేశారు. ఈ ప్రాంతం పూర్తిగా కొండలో ఉండడంతో ఎవరూ దాడి చేశారనే విషయం ఇంకా కొలిక్కి రాలేదు. కావాలనే ధ్వంసం చేశారని స్థానికులు చెబుతున్నారు.

Also Read: అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు మొలకలచెరువు ఎస్‌ఐ గాయత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కూల్చివేతలకు కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×