E-Paper
Advertisement

Annamaya District: అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత.. గుప్త నిధుల కోసమేనా?

Annamaya District: అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత.. గుప్త నిధుల కోసమేనా?
Advertisement

Abhayanjaneya Swamy temple in Annamaya: గుప్త నిధుల కోసం కొంతబంది దుండగులు ఓ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఏకంగా అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చి వేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలో గుప్త నిధుల కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం 16వ శతాబ్ధంలో నిర్మించిన కనుగొండ రాయస్వామి ఆలయానికి సమీపంలో ఇటీవల ఓ బండపై అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కి ఆలయం నిర్మించారు. అయితే ఈ ఆలయాన్ని కొంతమంది ధ్వంసం చేశారు.

Advertisement

ములకలచెరువులో గ్రామానికి కాస్త దూరంగా శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం ఉంది. దీనిని కొంతమంది గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అయితే పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించడంతోపాటు గేట్లు ధ్వంసం చేశారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్పీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, గుప్త నిధుల కోసం ఇలా చేసి ఉంటారేమోనని సీఐ రాజా రమేశ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఆలయాన్ని కూలగొట్టిన దుండగులను వెంటనే చట్ట ప్రకారం శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ఆదేశించాడు.

Advertisement

ఇదిలా ఉండగా, గతంలోనూ ఇలాగే ఓ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఆలయం సమీపంలో బండ్లపై చెక్కిన అభయాంజనేయ స్వామి కళ్లకు గంతలు కట్టి గుప్తనిధులు కోసం తవ్వకాలు జరిపిన ఘటన కలకలం రేగింది. అయితే ఏడాది కిందట ఓ బండపై అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించడంతోపాటు విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు స్థానికులు చెబుతున్నారు.

కొంతమంది దుండగులు కావాలనే దాడి చేశారని, సుత్తి, గడ్డపార సహాయంతో గోడను కిందిభాగంలో ధ్వంసం చేశారు. ఈ ప్రాంతం పూర్తిగా కొండలో ఉండడంతో ఎవరూ దాడి చేశారనే విషయం ఇంకా కొలిక్కి రాలేదు. కావాలనే ధ్వంసం చేశారని స్థానికులు చెబుతున్నారు.

Also Read: అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు మొలకలచెరువు ఎస్‌ఐ గాయత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కూల్చివేతలకు కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×