E-Paper
Advertisement

రెవెన్యూ అధికారి ఇళ్లపై ఏసీబీ పంజా.. లగ్జరీ కార్లు, ఫ్లాట్లు చూసి అధికారులే షాక్!

రెవెన్యూ అధికారి ఇళ్లపై ఏసీబీ పంజా.. లగ్జరీ కార్లు, ఫ్లాట్లు చూసి అధికారులే షాక్!

Kakinada: కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న రెవెన్యూ అధికారి శివరామకృష్ణ (శివరాం కుమార్) నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన మెరుపు దాడులు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ.. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కోట్ల విలువైన అక్రమ ఆస్తులను బట్టబయలు చేసింది.

ఏకకాలంలో నలువైపులా సోదాలు

ప్రత్యేక న్యాయస్థానం అనుమతితో జూన్ 5న ఏసీబీ అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. కాకినాడలోని శివరామకృష్ణ నివాసం, ఆయన కార్యాలయంతో పాటు సోదరి, మామగారి ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఈయన ఇళ్లలో దొరికిన సంపద చూసి అధికారులే విస్తుపోయారు.

విలాసవంతమైన ఫ్లాట్లు, భూములు

సోదాల్లో భారీగా స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. కాకినాడ ఎస్‌ఆర్‌ఎంటీ మాల్ వెనుక ఒక 3BHK ఫ్లాట్, ఆయన భార్య పేరిట మరో 4BHK లగ్జరీ ఫ్లాట్ ఉన్నట్లు తేలింది. వీటితో పాటు తెలంగాణలోని ఐటీ హబ్ కొండాపూర్‌లో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్, రామారావుపేటలో ఖరీదైన స్థలం, పలుచోట్ల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

కోట్లలో లగ్జరీ కార్లు, బంగారం

నిందితుడి ఇంట్లో లగ్జరీ వాహనాల జాతరే కనిపించింది. ఒక టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా ఎలక్ట్రిక్ BE6 కారుతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న మహీంద్రా థార్ రాక్స్ వాహనాన్ని ఏసీబీ సీజ్ చేసింది. వీటి విలువ కోట్లలోనే ఉంటుందని అంచనా. ఇవే కాకుండా 700 గ్రాముల బంగారు ఆభరణాలు, భారీగా నగదు, ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, ప్రీమియం మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల పూర్తి విలువను లెక్కించే పనిలో ఉన్న అధికారులు, సోదాలు ముగిశాక పూర్తి నివేదికను విడుదల చేయనున్నారు.

Also Read: భీంగల్‌లో ఘోర విషాదం.. నీటికుంటలో మునిగి ముగ్గురు చిన్నారుల దుర్మరణం!

Related News

అమెరికా టారిఫ్‌లు విధించినా తగ్గేదేలే.. ఆక్వా ఎగుమతుల్లో ఏపీ సరికొత్త రికార్డు!

ఏపీలో రాజ్యసభ సీట్ల వ్యవహారం.. టీడీపీకి మూడు-జనసేనకు ఒకటి, ఆ పార్టీల నుంచి ఎవరంటే

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Big Stories

×