E-Paper
Advertisement

Anam: ఆనంపై వేటు.. అయినా ఆపని కాంట్రవర్సీ కామెంట్స్..

Anam: ఆనంపై వేటు.. అయినా ఆపని కాంట్రవర్సీ కామెంట్స్..
Advertisement

Anam: ఈమధ్య వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ షాక్ ఇచ్చింది. ఆనంను వెంకటగిరి ఇంఛార్జి పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఉదయం సీఎం జగన్ ను రాంకుమార్ కలవగా.. సాయంత్రానికల్లా ఆయన్ను పార్టీ ఇంఛార్జ్ గా నియమించారు. ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నందుకు.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆనం ప్రాధాన్యతను తగ్గించడం కోసమే పార్టీ బాధ్యతలను నేదురుమల్లికి అప్పగించారు.

ఆనం మాత్రం తన కాంట్రవర్సీ కామెంట్లను ఆపేడం లేదు. లేటెస్ట్ గా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటున్నారు.. అవే వస్తే తామంతా ముందే ఇంటికి వెళ్లడం ఖాయమంటూ మరింత కలకలం రేపారు.

Advertisement

సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణాలు జరిగా జరగడం లేదని విమర్శించారు. ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చి నాలుగేళ్లు అవుతోంది.. ఇంకా సచివాలయాల నిర్మాణం పూర్తి కాకపోవడనికి సాంకేతిక కారణాలా? బిల్లుల చెల్లింపు జాప్యమా? తెలీడం లేదంటూ పబ్లిక్ గా కామెంట్లు చేశారు ఎమ్మెల్యే ఆనం.

ఆనం వ్యాఖ్యలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఆనం జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారేమో.. లేదంటే కలగని ఉంటారేమోనని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ చెప్పినట్టే 2024లోనే ఎన్నికలు వస్తాయని, వైసీపీ మళ్లీ గెలుస్తుందని, టీడీపీ మూతపడుతుందని అన్నారు. రోజుకో పార్టీ మారేవాళ్ల గురించి తాను మాట్లాడబోనని మండిపడ్డారు అనిల్.

Advertisement

ఇటీవల వైసీపీపై ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం పనులు చేయడం లేదని, అధికారులు మాట వినడం లేదని.. ఈసారి వైసీపీకి ప్రజలు ఓట్లు వేయరని.. తామంతా ఓడిపోతామంటూ.. ఇలా పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లూ సీనియర్ లీడర్ అని ఓపికగా ఉన్న అధిష్టానం.. తాజాగా వెంకటగిరి ఇంచార్జిగా ఉన్న ఆనంపై వేటు వేసింది.

మరీ ఈస్థాయిలో కాకపోయినా.. ఇటీవల ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డిని సీఎం జగన్ తాడేపల్లి పిలిపించుకుని మాట్లాడి ఆయనను కూల్ చేసి పంపించారు. కానీ, సీనియర్ ఎమ్మెల్యే ఆనం మాటలు మరీ డ్యామేజింగ్ గా ఉండటంతో.. నేరుగా ఆయనపై యాక్షన్ చేపట్టారు అధినేత జగన్. ఆనం వైసీపీని వీడి.. టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. పార్టీ వీడేముందు కావాలనే ఇలా వైసీపీ సర్కారుపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. ఆ విషయం తెలిసే.. పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి ఆనంను తొలగించింది వైసీపీ అధిష్టానం.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×