BigTV English

Adudham Andhra : ఆడుదాం ఆంధ్ర.. అట్టహాసంగా క్రీడోత్సవం ప్రారంభం..

Adudham Andhra : ఆడుదాం ఆంధ్ర.. అట్టహాసంగా క్రీడోత్సవం ప్రారంభం..

Adudham Andhra : గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ లో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. బ్యాడ్మింటన్‌​ ఆటగాడు కిందాంబి శ్రీకాంత్‌ తో సీఎం జగన్ క్రీడా జ్యోతిని వెలిగించారు. స్పోర్ట్స్‌ కిట్స్‌ను సీఎం జగన్‌ పరిశీలించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రికెట్‌ కిట్స్‌, వాలీబాల్‌ కిట్‌, బ్యాడ్మింటన్‌ కిట్‌లను క్రీడాకారులకు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5.09 లక్షల స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజినీ, కొందరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


ఆటల్లో స్పోర్ట్స్‌మెన్‌ స్పిరిట్ చాలా అవసరమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈ క్రీడా వేడుకలు దేశ చరిత్రలోనే మైలురాయిగా పేర్కొన్నారు. క్రీడలు ఆరోగ్యానికి ‍ఎంతగానో ఉపయోగపడతాయని సూచించారు. ఆటలు ఆడటం వల్ల బీపీ, డయాబెటిక్‌ లాంటి వ్యాధులు అదుపులో ఉంటాయని వివరించారు. గ్రామస్థాయిలో క్రీడలు ఎంతో అవసమని ఆణిముత్యాల లాంటి ఆటగాళ్లను వెతికి దేశానికి అందిస్తామని స్పష్టం చేశారు. గ్రామస్థాయి క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లటమే లక్ష్యమని స్పష్టం చేశారు.

15,004 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కోసం 9 వేల మైదానాలను సిద్ధం చేశారు. 5 దశల్లో పోటీల నిర్వస్తారు. రూ.12కోట్లకుపైగా నగదు బహుమతులు అందజేస్తారు. 3.33 లక్షల జట్లు పోటీ పడేందుకు 9,478 క్రీడా మైదానాలను సిద్ధం చేశారు. డిసెంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలు జరుగుతాయి.


జనవరి 9 నాటికి గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు ముగుస్తాయి. జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో పోటీలు జరుగుతాయి. జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో క్రీడలు నిర్వహిస్తారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు జిల్లా స్థాయిలో పోటీలు సాగుతాయి. ఫిబ్రవరి 6వ నుంచి 10 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఇలా 47 రోజుల పాటు ఈ క్రీడా ఈవెంట్ జరుగుతుంది.

Related News

AP News: పోరుబాటలో గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులు.. వాట్సాప్‌ గ్రూప్‌‌ల నుంచి ఎగ్జిట్, అక్టోబర్ ఒకటిన

YCP MLA’s in Assembly: అసెంబ్లీలో మాట్లాడని వైసీపీ ఎమ్మెల్యేలు.. గెలిచి ప్రయోజనమేంటి.?

Ntr Vidya Lakshmi Scheme 2025: ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త పథకాలు.. ఒక్కొక్కరికి లక్ష

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?

AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Tirumala Garuda Seva: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడ సేవ

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Big Stories

×