E-Paper
Advertisement

Ys Jagan: సినిమా విలన్‌ క్యారెక్టర్లు అన్నీ కలిపితే చంద్రబాబు.. జగన్‌

Ys Jagan: సినిమా విలన్‌ క్యారెక్టర్లు అన్నీ కలిపితే చంద్రబాబు.. జగన్‌
Advertisement

Ys Jaganపలు సినిమాల్లోని విలన్ క్యారెక్టర్లు అన్నీ కలిపితే చంద్రబాబు అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. మోసం, అబద్దాలు, వెన్నుపోటు కలిపితేనె చంద్రబాబు అని జగన్ విమర్శించారు. మోసగాళ్ల కూటమికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ బస్సు యాత్రను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ చంద్రబాబు, కూటమిపై మండిపడ్డారు. విపక్షాల కుట్రలు, కుతంత్రాలు చేధించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు.

Advertisement

“కావలిలో జన ప్రభంజనం కనిపిస్తోంది. మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా.. ఈ ఎన్నికలు జగన్, చంద్రబాబుకు మధ్య జరిగే ఎన్నికలు కాదు. మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం. మోసగాళ్లంతా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు.పేదల భవిష్యతు నిర్ణయించేది ఈ ఎన్నికలే. ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షం.. మోసగాళ్లంతా చంద్రబాబు పక్షం. సినిమా విలన్ క్యారెక్టర్లు అన్నీ కలిపితే చంద్రబాబు.. అబద్దాలు, వెన్నుపోటు, మోసాలు, కుట్రలు కలిపితే చంద్రబాబు.

ప్రజలతో చంద్రబాబుది అతకని బంధం.. మీ ఇంట్లో వున్న చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి.. ఎవరి వల్ల మేలు జరిగిందో అని.. చంద్రబాబు మూడుసార్లు రంగు రంగులు మేనిఫెస్టోలు చూపించారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోరు. మేనిఫెస్టోలో కనీసం 10 శాతం అయినా అమలు చేశారా..?.. పేదలకు చంద్రబాబు చేసిన ఒక్క మంచిపనైనా చేశారా..? చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా..? నేను నాలుగు నెలలుగా ప్రశ్నిస్తున్నా సరే చంద్రబాబు సమాధానం చెప్పడం లేదు.

Advertisement

Also Read: జగన్ కు మరో షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లతో 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. తను చేసిన పనులు చెప్పుకునే దైర్యం, దమ్ము చంద్రబాబుకు లేదు. మంచిచేసి ఉంటే చంద్రబాబు 3 పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకుంటారు” అని చంద్రబాబుపై జగన్ విమర్శలు చేశారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×