E-Paper
Advertisement

Congress: జగన్ కు మరో షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

Congress: జగన్ కు మరో షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

ysr mla join CongressCongress (Latest Political news in Andhra Pradesh): రాష్ట్ర అధికార పార్టీ వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల ముందు వరుస షాక్ లు తగులుతున్నాయి. గత కొన్ని రోజులుగా పార్టీలో సీటు రాని కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

వైసీపీకి పూతలపట్టు నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కడపలో జరిగిన కార్యక్రమంలో ఎంఎస్ బాబుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

పేదోడి సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని నమ్మి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు.

ఇటీవలే వైసీపీ అధిష్ఠానం పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది. దీంతో వారంతా వరుసగా పార్టీని వీడుతున్నారు. వీరు ఇలా పార్టీని వీడడంతో వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఇంది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×