BigTV English
Advertisement

Chintamaneni prabhakar: మళ్లీ తెరపైకి చింతమనేని.. ఈసారి సాక్షి ఆఫీస్ పైకి

Chintamaneni prabhakar: మళ్లీ తెరపైకి చింతమనేని.. ఈసారి సాక్షి ఆఫీస్ పైకి

గతంలో టీడీపీ హయాంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దూకుడు గురించి అందరికీ తెలిసిందే. ఓ మహిళా ఎమ్మార్వోతో ఆయన ప్రవర్తన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత టీడీపీకి కూడా అది కాస్త ఇబ్బందిగా మారింది. మళ్లీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక మరోసారి చింతమనేని వార్తల్లో వ్యక్తిగా మారారు. ఈసారి ఆయన సాక్షి ఆఫీస్ పై దాడి చేశారని అంటున్నారు. తనపై తప్పుడు వార్తలు రాసినందుకు నిలదీయడానికి మాత్రమే వచ్చానని ఆయన చెబుతున్నారు. ఇందులో నిజం ఎంతున్నా.. మరోసారి చింతమనేని వార్తల్లోకెక్కడం, అది కూడా దాడి చేశారని ఆయనపై ఆరోపణలు రావడం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.


టీడీపీలో చింతమనేని ఫైర్ బ్రాండ్. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక, మహిళా ఎమ్మార్వోపై దాడి చేశారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రవర్తన సమర్థనీయంగా లేనట్టు వీడియో సాక్ష్యాలు కూడా ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ ఫలితం 2019లో కనపడింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తిరిగి 2024 ఎన్నికల్లో చింతమనేని దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి మరో వివాదంతో ఆయన మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.

ఆఫీస్ పై దాడి..?
ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపైకి ఆయన దాడికి వెళ్లారంటూ వీడియోలను సాక్షి మీడియా బయటపెట్టింది. కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు దెబ్బతిన్నట్టుగా కొన్ని వీడియోలను పోస్ట్ చేశారు. చింతమనేని, ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి సాక్షి ఆఫీస్‌లో దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఆఫీస్ లోని కంప్యూటర్లు ధ్వంసం చేశారని అంటున్నారు.


అసలు కారణం ఏంటి..?
దెందులూరు నియోజకవర్గానికి చెందిన దాసరి బాబూరావు అనే వ్యక్తికి చెందిన పొలంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్నారని అంటున్నారు. అయితే సదరు బాబూరావు టీడీపీ ఆఫీస్ కి వెళ్లడం, అక్కడ ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్యాయత్నానికి ఎమ్మెల్యే చింతమనేని కారణం అంటూ సాక్షిలో కథనం వచ్చింది. దీన్ని ఎమ్మెల్యే ఖండించారు. వివరాలు తెలుసుకోకుండా వార్తలు రాశారని, తనకి సంబంధం లేకపోయినా తన పేరుని అందులో చేర్చారని ఆయన అంటున్నారు. ఆ విషయం కనుక్కోడానికే తాను సాక్షి ఆఫీస్ కి వచ్చానంటున్నారు చింతమనేని. అంతేకానీ తాను అక్కడ ఎలాంటి గొడవ చేయలేదని చెబుతున్నారు.

సాక్షి వెర్షన్ మాత్రం మరోలా ఉంది. చింతమనేని సదరు రిపోర్టర్ తో ఫోన్ లో మాట్లాడుతున్న వీడియోని కూడా సాక్షి సోషల్ మీడియాలో ఉంచింది. చింతమనేని వల్లే బాబూరావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారని వైసీపీ కూడా ఆరోపిస్తోంది. ఇక సాక్షి ఆఫీస్ పై దాడి అంటూ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు వైరల్ చేస్తున్నారు. తనపై కావాలనే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారంటూ చింతమనేని చెప్పడం విశేషం. మరి చింతమనేని విషయంలో నిజానిజాలు ఏంటో నిలకడమీద తెలియాల్సిందే. అయితే ఆయన రోడ్డెక్కడం, సాక్షి తమపై దాడి జరిగిందని చెప్పడం మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Related News

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Big Stories

×