Union Budget 2025 : 2025-26 ఏడాది బడ్జెట్ ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏపీకి అధిక ప్రాధాన్యత కల్పించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఇక ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నిధుల వివరాలివే.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5,936 కోట్ల కేటాయింపు
పోలవరం ప్రాజెక్ట్ బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్ల కేటాయింపు
విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.3,295 కోట్ల కేటాయింపు
విశాఖ పోర్ట్ కు రూ.730 కోట్ల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ లోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్ల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ లోని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కు రూ.186 కోట్ల కేటాయింపు
లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్కు సపోర్ట్ గా రూ.375 కోట్ల కేటాయింపు
రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్ల కేటాయింపు
ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు రూ.242.50 కోట్లు కేటాయింపు

Share