Ambati Rambabu: భారత దేశం చట్టం పదును ఎంటో పేమ్మశానికి చూపిస్తా అని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎడిస్సీ జరిగిన అక్రమాలపై సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలని అన్నారు. ఆగష్టు 7,8 లో జరిగే పాద యాత్రని వాయిదా పడిందని మళ్ళీ ఎప్పుడు చేస్తానో తెలియ జెస్తానని అన్నారు. మా ఇంటి మీద జరిగిన దాడిలో పోలీస్లు ఏమి చేయలేదు. మా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేసే వరకు నా ఉద్యమం ఆగదని ఫైర్ అయ్యారు.
నేను ఒక రోజు దీక్ష కుడా చేశాను. ఈ దాడిలో ప్రధాన సూత్ర దారి పేమ్మసాని చంద్రశేఖర్ అని తేల్చిచెప్పారు. నా ఇంటి మీద దాడి జరిగిన ముందు రోజు, పేమ్మసాని మీడియాలో నాకు 70 mm సినిమా చూపిస్తా అన్నారు అలాగే చేసారని అన్నారు. నా ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారు, పోలీస్లు చూస్తూ ఉన్నారని, భారత దేశంలో నీకు చట్టాలు ఎలా ఉంటాయో చూపిస్తాను నిన్ను వదిలే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యారు.
Also Read: దేశంలో తగ్గిన బంగారం డిమాండ్.. 6 శాతానికి పతనం, నాణాలు-బిస్కట్లు-ETFలపై మొగ్గు
నాతో ఉన్నా మహిళల సైతం అవమానించారని, నీకు డబ్బులు బలం, అధికారం మదంతో ఇవన్నీ చేసావు. చట్టం ఎంత పదునైందో నీకు చూపిస్తానని ఫైర్ అయ్యారు. ఆగష్టు 15 తరువాత రెండు రోజులు పాద యాత్ర చేస్తానన్నారు. నా వినతి పాద యాత్రలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నానని, ఢిల్లీలో విద్యార్థుల మీద దాడి చేసిన పరిస్థితి పోలీస్ వాళ్లు నాకు పర్మిషన్ ఇవ్వాలని, ప్రభుత్వం అడ్డు పడకూడదని భావిస్తున్నానని తెలిపారు.
చట్టం ముందు అందరూ సామానులే. ఎవరు తప్పించుకోలేరు. డిఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయని, పోస్టులు అమ్ముకున్న పరిస్థితి, స్పాట్లో, కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారని తెలిపారు. కష్ట పడిన వారికీ అన్యాయం చేసారని ఈ పాపం ఉరికే పోదని అన్నారు. నిన్ను వదిలే ప్రసక్తే లేదని పేమ్మసాని చంద్రశేఖర్ ని టార్గెట్ చేస్దూ మాట్లాడారు.
Also Read: జహీరాబాద్లో షాకింగ్ సీన్.. చెప్పుతో కొట్టుకున్న ఎంఐఎం కౌన్సిలర్ భర్త!