E-Paper
Advertisement

విశాఖకు మహార్థశ.. ఐటీఐ క్లస్టర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, పీఎం సేతు అమలులో ఏపీ టాప్

విశాఖకు మహార్థశ..  ఐటీఐ క్లస్టర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, పీఎం సేతు అమలులో ఏపీ టాప్
Advertisement

Delhi: విశాఖ సిటీ రూపు రేఖలు మారిపోతున్నాయి. తాజాగా ఐటీఐ క్లస్టర్‌కు స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌‌కు ఆమోదం తెలిపింది కేంద్రప్రభుత్వం. ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ భాగస్వామ్యంతో ఆధునీకరణ పనులు చేపట్టనుంది. అంతేకాదు ఏపీ అరుదైన ఘనత సాధించింది కూడా. దేశంలో పీఎం సేతు పథకం అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

విశాఖకు మహార్థశ.. ఐటీఐ క్లస్టర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Advertisement

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్- పీఎం సేతు. ఈ పథకం అమలులో దేశంలో తొలి రాష్ట్రంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఈ పథకం కింద విశాఖ ఐటీఐ క్లస్టర్‌కు సంబంధించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

దేశంలో పీఎం-సేతు కింద ఆమోదం పొందిన తొలి ప్రాజెక్టు ఇదే. జాతీయ స్థాయిలో రూ.60 వేల కోట్లతో చేపడుతున్న కార్యక్రమం ఇది. విశాఖ ఐటీఐల అభివృద్ధికి ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా, న్యూ ఏజ్ మేకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- NAMTECHతో కలిసి ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో హబ్ అండ్ స్పోక్ మోడల్‌ను అమలు చేయనుంది.

Advertisement

పీఎం సేతు అమలులో ఏపీ టాప్

ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఐటీఐ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. కోర్సు పూర్తి చేసిన వెంటనే విద్యార్థులకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రభుత్వ ఐటీఐలను బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు అధికారులు.

ఏపీ బాటలో మరో 12 రాష్ట్రాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమల భాగస్వామ్యానికి టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 60 వేల కోట్ల ఈ పథకాన్ని ప్రారంభించింది.

ALSO READ: డీఎస్సీ లీకేజీకి ఛాన్స్ లేదు.. తేల్చిచెప్పిన ఏపీ విద్యాశాఖ

శనివారం న్యూఢిల్లీలోని కౌశల్ భవన్‌లో జరిగిన జాతీయ స్టీరింగ్ కమిటీ మూడో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. నైపుణ్యాభివృద్ధి- వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబాశ్రీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ సీనియర్ అధికారులు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక సంస్థలు-ఆసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ బ్యాంకుతో సహా అభివృద్ధి భాగస్వాముల ప్రతినిధులు హాజరయ్యారు. పీఎం-సేతు పథకం కింద ఇండస్ట్రీ పార్టనర్‌ను చేర్చుకున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలచింది.

Related News

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

Big Stories

Advertisement
×