Gundeninda GudiGantalu Today episode may 31st : బాలుని కలిసిన మీనా విద్య ఏమి సమాధానం చెప్పలేదు. తను చెప్పేది అబద్ధమని నాకు బాగా అర్థమవుతుంది. కానీ రోహిణి గురించి నిజాలు మాత్రం మాట్లాడడం లేదు. రోహిణి అసలు మలేషియా కాదని నాకు అర్థం అవుతుంది. ఇన్ని రోజులు మా అమ్మ ఆవిడ గురించి గొప్పగా చెప్పుకుంది కదా.. ఆవిడకురా మలేషియా నుంచి ఇలా విసిరేస్తాను అని చెప్పింది కదా అసలు ఈ మలేషియా యవ్వారం ఏంటో తెలుస్తానని బాలు అంటాడు. ఎలాగైనా సరే రోహిణి మీద నాకున్న అనుమానం తీర్చుకుంటాను అని బాలు కంకణం కట్టుకుంటాడు.. నెక్స్ట్ ఎపిసోడ్ లో మాత్రం బాలు తన పనిని కానిచ్చి రోహిణికి షాక్ ఇస్తాడని అర్థమవుతుంది..
రోహిణి ఎలాగైనా సరే బాలు వాళ్ళకి దొరకకుండా ఈ 30 లక్షలు మ్యాటర్ ని తేల్చాలి అని అనుకుంటుంది.. కానీ బాలు మాత్రం రోహిణి బండారు అని బయటపెట్టేలా ప్లాన్ చేస్తాను అని అనుకుంటాడు.. అసలు ఈ మలేషియా ఎక్కడినుంచి వచ్చింది? ఏంటి అన్నది నేను కనిపెట్టి చూపిస్తాను అని బాలు అనుకుంటాడు. రోహిణి మలేషియా గురించి వాళ్ళకి అనుమానం వచ్చింది కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంది.. ఈ మలేషియా మ్యాటర్ తేల్చే లోపల ఎలాగైనా సరే నేను మనోజ్ ని నా వైపు తిప్పుకొని ప్రెగ్నెంట్ అవ్వాలి.. అప్పుడు నేను ఎవరికీ సంజయాసీ చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటుంది.. కానీ రోహిణికి మాత్రం అడుగడుగునా ఏదో ఒక టెన్షన్లు ఎదురవుతూనే ఉంటాయి.. చివరికి బాలు వల్లే తన మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది..
బాలు ఇంట్లోకి రాగానే చాలా హడావిడిగా అందరినీ పిలుస్తూ ఉంటాడు.. ముందుగా ప్రభావతి సత్యంని కేకలు వేసి మరీ పిలుస్తాడు.. అమ్మ నాన్న ఎక్కడున్నారు మీరు అనేసి బాలు గట్టిగా కేకలు వేశారు దానికి ప్రభావతి. అరే మేము ఇక్కడే ఉన్నాం కళ్ళు కనిపించట్లేదు రా ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని అడుగుతుంది.. ఏమైనా ఎందుకు అట్లా అరుస్తున్నావ్ అని ప్రభావతి అడుగుతుంది. చెప్తాను ఆగు అని అందరిని కేకలు వేసి మరి పిలుస్తూ ఉంటాడు బాలు. అరే నైటీలు వేసుకునేవాడా లేచిపోయిన డబ్బు అమ్మ. ఇంటిని మింగేసిన పాలరమ్మ. మూడోసారి లక్షల పోగొట్టుకున్న మనోజ్ గా అని అందరినీ పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు కానీ ప్రభావతి వాళ్ళందరికీ పేర్లు ఉన్నాయి కదా.. ఎందుకు నువ్వు అట్టా పిలుస్తూ ఉంటావు అని అడుగుతుంది..
అందరికీ కొన్ని కాయితాలు వీటిని ఒకసారి చూడండి అని అనగానే మనోజ్ ఏంట్రా.. కవితలు ఇచ్చి డబ్బులు అడుక్కుంటున్నావా ఏంటి అని వెటకారంగా మాట్లాడుతాడు. కాగితాలు ఇచ్చి డబ్బులు అడుక్కునే స్కీమ్ ఏమైనా చేస్తున్నావని మనోజ్ అడుగుతాడు దానికి బాలు అరేయ్ మూడోసారి లక్షలు మింగినోడా ఒకసారి నీకు చదువు వచ్చు కదా అన్ని డిగ్రీలు ఉన్నాయి కదా అందులో ఏం రాసిందో చదువుకోరా అనేసి అంటాడు. మీనా మాత్రం నాకు చదువు రాదు కదండీ అని అనగానే బాలు నాకు కూడా ఇంగ్లీష్ రాదు తమిళం రాదు హిందీ కూడా రాదు. నువ్వు నేను ఒకటే అని బాలు అంటాడు. ఇద్దరి సరసాలు ఆపేసి అసలు ఈ పేపర్లు ఎందుకు ఇచ్చావు చెప్పరా అని ప్రభావతి అంటుంది. ఇక సత్యం కూడా అసలు కాగితాలకు ఏంటిరా అని అనగానే పాస్పోర్ట్ కోసం అని రవి అంటాడు.
అయినా ఇప్పుడు అర్జెంటుగా పాస్పోర్ట్ తీసుకుని ఏం చేయాలి రా అని బాలుని అడుగుతారు. నేను మీనా పెళ్లైన పని నుంచి ఎప్పటి ఎక్కడికి వెళ్ళలేదు కదా.. మేమిద్దరం కలిసి మలేషియా కి వెళ్ళాలని అనుకుంటున్నాము మీ ఇద్దరికీ మీ అందరిని కూడా తీసుకొని వెళ్లాలని పాస్పోర్ట్ కోసం ఈ కాగితాలను తీసుకొచ్చాను అని బాలు అంటాడు. వాళ్ళు చెప్పిన మాట విని రోహిణి ఫ్యుజులు ఎగిరిపోతాయి. ఏంటి మలేషియానా ఇప్పుడు ఎందుకు అన్నట్లుగా ఆలోచిస్తుంది.. మొత్తానికి రోహిణి గుండెల్లో భయం మొదలవుతుంది. రోహిణి నేను బయట పెడుతున్నా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది…
అయినా ఇప్పుడు పాస్పోర్ట్ అప్లై చేసి ఏం చేయాలి బాలు. నాకు ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంది కదా మళ్లీ ఎందుకు కొత్త పాస్వర్డ్ అని శృతి అడుగుతుంది. నీకుంది నాకు కూడా ఉంది కాకపోతే తల్లి రెన్యువల్ చేయించలేదు అని మనోజ్ అంటాడు.. నీకు కూడా పాస్పోర్ట్ ఉంటుంది ఎందుకు ఉండదు మలేషియన్ నుంచి వచ్చింది కదా ఉంటుంది అని అనగానే అవును ఉంది అని రోహిణి అనుకుంటుంది. ఇదంతా మీరు పని మనకు వెళ్లడానికే ప్లాన్ చేస్తున్నారా అని బాలుని శృతి అడుగుతుంది. అలాగే ఈ రెండోసారి లక్షలు మింగేలా చేసిన ఈవిడ గారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్లే సద్దాం అని అనగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అతనికి బాలు ప్లాన్ తో రోహిణి బండారం బయటపడేలా కనిపిస్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో రోహిణి బాలు ప్లాన్ నుంచి బయట పడుతుందా లేదా అన్నది చూడాలి…