E-Paper
Advertisement

Vangalapudi Anitha: నోరు అదుపులో పెట్టుకో.. అంబటి రాంబాబుకు హోం మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!

Vangalapudi Anitha: నోరు అదుపులో పెట్టుకో.. అంబటి రాంబాబుకు హోం మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement

Vangalapudi Anitha: అనకాపల్లి జిల్లా వేదికగా హోం మంత్రి వంగలపూడి అనిత వైసిపి నాయకుడు అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని.. ఆయన ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆమె మండిపడ్డారు. గతంలో తాను గౌరవార్థం ‘గారు’ అని సంబోధించేదాన్నని.. కానీ అంబటి రాంబాబు ప్రవర్తన చూస్తుంటే ఆయన ఆ గౌరవానికి ఏమాత్రం అర్హుడు కాదని అనిత స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలను హోం మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘చంద్రబాబు గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడే ముందు నీ ఇంటికి వెళ్లి నీ భార్యను, కూతురిని అడుగు, వారు చెబుతారు ఆయన విలువ ఏమిటో’అంటూ ఘాటుగా స్పందించారు. అంబటి రాంబాబు కేవలం రాజకీయ లబ్ధి కోసం అత్యంత నీచమైన భాషను వాడుతున్నారని.. ఇది ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.

Advertisement

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వైసిపి నేతలు కుట్రలు చేస్తున్నారని అనిత ఆరోపించారు. విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తే సహించే ప్రసక్తే లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పట్టాభి ఒక పదం వాడారనే నెపంతో పార్టీ కార్యాలయంపై దాడులు చేశారని, ఇప్పుడు అంబటి అంతకంటే దారుణంగా మాట్లాడుతున్నారని గుర్తుచేశారు.

చంద్రబాబు నాయుడును అన్యాయంగా జైలుకు పంపినందుకే ప్రజలు వైసిపిని 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేశారని ఆమె విమర్శించారు. పోలీసులపై కూడా అంబటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని, విద్వేషపూరిత ప్రసంగాల ద్వారా రాష్ట్రంలో అలజడి సృష్టించే పన్నాగం సాగనివ్వమని అనిత స్పష్టం చేశారు. అంబటి మాట్లాడే భాషను ఆయన కుటుంబ సభ్యులు కూడా సమర్థించరని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆమె హితవు పలికారు.

Advertisement

Also Read: చెప్పుతో కొడతాం.. నాలుక చీరేస్తాం.. టీడీపీ శ్రేణుల ముట్టడితో గుంటూరులో హైటెన్షన్!

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×