Sabitha Indra Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతికార పాలన నడిపిస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సబితా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు గాలికొదిలేసి పాలన సాగిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో పనిచేస్తున్న పోలీసులకు మాజీ సీఎం అడ్రస్ తెలియదంటే అవమానించడమేనని అన్నారు.
కేసీఆర్ ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టి సంతోషపడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని ఆరోపించారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కేసీఆర్(KCR) పేరు శాశ్వతంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ బయటపెట్టిన ప్రతి సందర్భంలో నోటీసులు ఇచ్చి డైవర్షన్ చేస్తున్నారని అన్నారు. సీఎంకు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కు సంబంధం ఉండదు.. పోలీస్ డిపార్టెంట్లోని ఒక వింగ్ పనిచేస్తుందని అన్నారు. కానీ ప్రస్తుత సీఎం కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్కు నోటీసులకు ఇవ్వడంపై తెలంగాణ సమాజం బాధపడుతుందని ఆవేధన వ్యక్తం చేశారు. కక్షపూరిత చర్య దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టంగా అర్ధమైతుందన్నారు.
Also Read: Sreeleela: పెళ్ళాన్ని అడిగినట్టు అడిగారు.. శ్రీలీల ఆశ్చర్యకర వ్యాఖ్యలు..!
హరీష్ రావు(Harish Rao) బోగ్గు కుంభకోణంపై మాట్లాడిన వెంటనే నోటీసులు ఇచ్చారు.. మరుసటి రోజు కేటీఆర్(KTR)కు ఈవిధంగా ప్రభుత్వం భయబ్రాంతులకు గురిచేస్తోందన్నారు. విచారణకు సహకారిస్తాను ఎర్రవెల్లికి వచ్చి నోటీసులు ఇవ్వండీ అని మాజీ సీఎం కేసీఆర్ వివరించారని తెలిపారు. ప్రభుత్వం మాత్రం కావాలనే ఒక రోజు గ్యాప్తో నోటీస్ ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కేంద్రం విడుదల చేసిన ఎకనామిక్ సర్వేపై ప్రతి ఒక్కరూ ప్రశంశల జల్లు కురిపిస్తున్నారని మాజీ మంత్రి సబితా అన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొలేరని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే మాజీ సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
Also Read: Mahabharata: మహాభారతంలో అత్యంత అదృష్టవంతుడు.. అత్యంత దురదృష్టవంతుడు ఆయనే..! ఎవరో తెలుసా..?