E-Paper
Advertisement

TDP Pulivarthi SudhaReddy : వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ఆరోపణలపై మండిపడ్డ పులివర్తి సుధారెడ్డి…కఠిన చర్యలుంటాయని హెచ్చరిక

TDP Pulivarthi SudhaReddy : వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ఆరోపణలపై మండిపడ్డ పులివర్తి సుధారెడ్డి…కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
Advertisement

TDP Pulivarthi Sudha Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి చంద్రగిరి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్​రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో తమ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఆమె ఖండించారు.

ఆధారాలు లేని ఆరోపణలా…

Advertisement

ఎక్కడో ఏదో జరిగితే, ఆధారాలు లేకుండా తమ కుటుంబ సభ్యులు పేర్లు ప్రస్తావించడం బాధాకరమన్నారు. గ్రూపుల్లో తన పేరు ప్రస్తావించడంతో వాట్సాప్ గ్రూపు అడ్మిన్’లకు ఫోన్ చేసి చెప్పామన్నారు. అవినీతి ఆరోపణలపై అదే వాట్సాప్ గ్రూపులో రిప్లై ఇస్తే తమ మెసేజ్’లను కావాలని డెలీట్ చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న అడ్మిన్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. విచారణలో భాగంగా ఫోన్ నెంబర్లు పరిశీలిస్తే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది అని తెలిసిందన్నారు. మిమ్మల్ని చంపాలని చూసిన చెవిరెడ్డికి తప్పుడు మెసేజ్’లు పెట్టడం లెక్కలేదన్న సుధారెడ్డి, గత 5 ఏళ్లలో ఆయన అవినీతి కూపంలో కూరుకుపోయరన్నారు.

100 ఎకరాల ఆసామి మేం…

Advertisement

మా తాతకే 100 ఎకరాల ఆస్తి ఉంది, మా నాన్న డిఎస్పీగా పనిచేసినా అవినీతికి పాల్పడలేదన్నారు. చెవిరెడ్డి రూ.7 వేలకు జనచైతన్యలో కమీషన్ ఏజెంట్ గా పనిచేశారని చెప్పిన సుధారెడ్డి, తమకు చెవిరెడ్డికి చాలా తేడా ఉందన్నారు. ఆయన నిన్నమొన్న డబ్బులు చూశారని, తాము డబ్బుల్లో పుట్టి పెరిగామన్నారు. బయటకు రాలేక ఎమ్మెల్యే పులివర్తి నానిపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. పులివర్తి నాని మేనమామ అప్పట్లోనే గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేశారని, అలాంటి తమపై తప్పుడు మెసేజ్ లు పంపితే ఉపేక్షించేది లేదన్నారు. చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచిస్తామన్నారు.

Also read : ఏపీ ప్రజలకు అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×