BigTV English

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి, ఇతర ముడిపదార్థాల వాడకంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని జగన్ లేఖలో కోరారు.


తన రాజకీయాల కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేశారని లేఖలో పేర్కొన్నారు. టీటీడీ చేసిన పనుల వల్ల కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వాపోయారు. ఎంతో సున్నితమైన విషయాన్ని చంద్రబాబు తన రాజకీయ అవసరాలకు వాడుకున్నారని, సీఎం పదవికే మచ్చతెచ్చేలా ప్రవర్తించారని లేఖలో రాశారు. అంతేకాకుండా టీటీడీ సంప్రదాయాలపైనే అందరికీ అనుమానాలొచ్చేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ లేఖలో డిమాండ్ చేశారు.

Also Read: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత


గతంలోనూ జగన్ ప్రధానికి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో.. వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు, వేధింపులు భరించలేక ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, ఆస్తుల ధ్వంసం పెరిగిందని, ఇంకా రాష్ట్రంలో ఏమేం జరుగుతున్నాయో చెప్పేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలంటూ జులైలో ప్రధానికి లేఖ రాశారు జగన్.

కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఉదయం బీజేవైఎం నేతలు జగన్ ఇంటి ఎదుట నిరసన చేయగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి తాడేపల్లి పీఎస్ కు తరలించారు.

 

 

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×