E-Paper
Advertisement

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ
Advertisement

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి, ఇతర ముడిపదార్థాల వాడకంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని జగన్ లేఖలో కోరారు.

తన రాజకీయాల కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేశారని లేఖలో పేర్కొన్నారు. టీటీడీ చేసిన పనుల వల్ల కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వాపోయారు. ఎంతో సున్నితమైన విషయాన్ని చంద్రబాబు తన రాజకీయ అవసరాలకు వాడుకున్నారని, సీఎం పదవికే మచ్చతెచ్చేలా ప్రవర్తించారని లేఖలో రాశారు. అంతేకాకుండా టీటీడీ సంప్రదాయాలపైనే అందరికీ అనుమానాలొచ్చేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ లేఖలో డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

గతంలోనూ జగన్ ప్రధానికి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో.. వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు, వేధింపులు భరించలేక ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, ఆస్తుల ధ్వంసం పెరిగిందని, ఇంకా రాష్ట్రంలో ఏమేం జరుగుతున్నాయో చెప్పేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలంటూ జులైలో ప్రధానికి లేఖ రాశారు జగన్.

Advertisement

కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఉదయం బీజేవైఎం నేతలు జగన్ ఇంటి ఎదుట నిరసన చేయగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి తాడేపల్లి పీఎస్ కు తరలించారు.

 

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×