E-Paper
Advertisement

Tirumala Laddu Issue: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Tirumala Laddu Issue: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత
Advertisement

Tirumala Laddu Issue: తిరుమల శ్రీవారికి నివేదించిన తర్వాత తీసుకునే లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు భక్తులు. అలాంటి ప్రసాదం కల్తీ అయిందన్న వ్యవహారం ఏపీనే కాదు.. యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. దీనిపై ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధాలు జరుగుతున్నాయి. కేంద్రమంత్రులు సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టిటిడి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈఓ లడ్డూ కల్తీపై ప్రాథమిక నివేదికను ఆయనకు అందజేయగా.. దానిపై చర్చించారు. అలాగే ఆలయ సంప్రోక్షణపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజాగా.. హిందూవాదులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిరసనకు దిగారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపనూనె వాడారని తేలడంతో గత ప్రభుత్వ తీరుపై హిందూవాదులు మండిపడుతున్నారు. మాజీ సీఎం ఇంటి దగ్గర నిరసనలు చేపట్టారు. దీనికి జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసన కారులను అరెస్ట్ చేసి తాడేపల్లి పీఎస్ కు తరలించారు.

Also Read: రంగరాయ మెడికల్ కాలేజీ ఘటన.. దిగొచ్చిన ఎమ్మెల్యే.. డాక్టర్ కు క్షమాపణ

Advertisement

శ్రీవారి ఆలయంలో రేపు మహాశాంతి యాగం చేపట్టనుంది టీటీడీ. కల్తీ నెయ్యి వల్ల జరిగిన అపచారానికి పరిహారంగా యాగం నిర్వహించనున్నారు. శ్రీవారి నిత్య కైంకర్యాలు, భక్తుల రద్దీ దృష్ట్యా రేపు ఒకరోజు యాగం నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారు. యోచిస్తున్నారు. శ్రీవారి ఆనంద నిలయానికి వెనుక పాత పరకామణి మండపంలో ఈ క్రతువు చేపట్టనున్నారు. సాయంత్రంలోగా యాగానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

 

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×