BigTV English
Advertisement

AP Government: ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్

AP Government: ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్

AP Government: అమరావతి రాజధాని పరిధిలో భవనాల నిర్మాణాలపై ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్ జారీ చేసింది. దీంతో అమరావతిలో ప్రభుత్వ భవనాలు నిర్మించనున్నారు.


భవనాల సముదాయ నిర్మాణం కోసం 1575 ఎకరాల భూమిని నోటీఫై చేస్తూ గెజిట్ విడుదలైంది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, అధికారులు, ప్రజాప్రతినిధుల క్వార్టర్స్, భవనాలకు కేటాయించిన భూమిని ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు మాస్టార్ ప్లాన్ ప్రకారం, జోనింగ్ నిబంధనలను అనుసరించి నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నోటిఫై చేసిన గ్రామాల భూమి వివరాలను సీఆర్డీఏ గెజిట్ లో పెట్టింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు కొండమరాజు పాలెం గ్రామాల్లోని 1575 ఎకరాల భూమిని నోటిఫై చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ వెల్లడించారు. ఈనోటిఫై చేసిన ప్రాంతంలో ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయి. రాజధాని నిర్మాణంలో తొలి విడత పనులు నోటిఫై చేసిన ప్రాంతంలోనే ప్రభుత్వ భవనాలను నిర్మించనుంది.


సీఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం.. సీఆర్డీఏ బహిరంగ ప్రకటన జారీచేసింది. ప్రభుత్వ కంప్లెక్స్ భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది.

Tags

Related News

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Big Stories

×