E-Paper
Advertisement

AP Government: ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్

AP Government: ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్

AP Government: అమరావతి రాజధాని పరిధిలో భవనాల నిర్మాణాలపై ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్ జారీ చేసింది. దీంతో అమరావతిలో ప్రభుత్వ భవనాలు నిర్మించనున్నారు.

భవనాల సముదాయ నిర్మాణం కోసం 1575 ఎకరాల భూమిని నోటీఫై చేస్తూ గెజిట్ విడుదలైంది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, అధికారులు, ప్రజాప్రతినిధుల క్వార్టర్స్, భవనాలకు కేటాయించిన భూమిని ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు మాస్టార్ ప్లాన్ ప్రకారం, జోనింగ్ నిబంధనలను అనుసరించి నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నోటిఫై చేసిన గ్రామాల భూమి వివరాలను సీఆర్డీఏ గెజిట్ లో పెట్టింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు కొండమరాజు పాలెం గ్రామాల్లోని 1575 ఎకరాల భూమిని నోటిఫై చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ వెల్లడించారు. ఈనోటిఫై చేసిన ప్రాంతంలో ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయి. రాజధాని నిర్మాణంలో తొలి విడత పనులు నోటిఫై చేసిన ప్రాంతంలోనే ప్రభుత్వ భవనాలను నిర్మించనుంది.

సీఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం.. సీఆర్డీఏ బహిరంగ ప్రకటన జారీచేసింది. ప్రభుత్వ కంప్లెక్స్ భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×