AP Govt e-Cycle Scheme: ఏపీ ప్రభుత్వం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా కేవలం రూ. 5,000 డౌ పేమెంట్ తో ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈవీ సైకిళ్లపై రూ. 11,000 సబ్సిడీ అందిస్తుంది. వీటి కోసం స్థానిక గ్రామ లేదా వార్డు సచివాలయం లేదా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA)లో నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం కుప్పం, కృష్ణా జిల్లాలో ఈ స్కీమ్ అమలు చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.
ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అసలు విలువ రూ. 23,999. లబ్ధిదారులు ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. ముందుగా రూ.5000 డౌన్ పేమెంట్ చెల్లిస్తే సరిపోతుంది. రూ.11 వేల రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని 24 నెలల పాటు సులభ వాయిదాలలో చెల్లించవచ్చు. ఈ మొత్తాన్ని బ్యాంక్ నుంచి లోన్ గా తీసుకోవచ్చు.
కుప్పంలో 5000, కృష్ణా జిల్లాలో 500 ఈవీ సైకిళ్లు మొదటి విడతలో అందిస్తారు. ఈవీ సైకిళ్లు.. సాధారణంగా 250W BLDC సామర్థ్యం ఉన్న మోటార్ బైక్లు, ఇవి 40-60 కి.మీ.ల రేంజ్ను కలిగి ఉంటాయి. రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎలక్ట్రిక్ సైకిళ్లకు అప్లై చేసుకోవచ్చు.
Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 90% సబ్సిడీతో స్వయం ఉపాధి పథకాలు.. అప్లై చేసుకోండిలా!