E-Paper
Advertisement

Aadhaar Camps: విద్యార్థులకు అలర్ట్.. ఈ తేదీల్లో స్కూళ్లలో ఆధార్ క్యాంపులు, మిస్ కావద్దు

Aadhaar Camps: విద్యార్థులకు అలర్ట్.. ఈ తేదీల్లో స్కూళ్లలో ఆధార్ క్యాంపులు, మిస్ కావద్దు

Aadhaar Camps: చైల్డ్ ఆధార్ కార్డులు ఉన్న వారు 5, 15 సంవత్సరాల తర్వాత బయోమెట్రిక్ తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోవాలి. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 17 నుంచి 26వ తేదీ వరకు పాఠశాలల్లో మరో విడత ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరక్టర్ శివప్రసాద్ బుధవారం కలెక్టర్లకు లేఖ రాశారు.

ఇంకా 15.46 లక్షల బయోమెట్రిక్ పెండింగ్

రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత నాలుగేళ్లుగా మారుమూల ప్రాంతాల్లోనూ ఆధార్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఆధార్ జారీ సంస్థ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 15.46 లక్షల మంది పిల్లలు తమ ఆధార్ బయోమెట్రిక్ ఇంకా అప్డేట్ చేయించుకోవాల్సి ఉంది. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆధార్ అప్డేట్ లేకపోతే పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లల బయోమెట్రిక్‌ అప్డేట్‌ పూర్తిగా ఉచితమని, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

విద్యార్థులకు ఆధార్ కీలకం

ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు, బ్యాంకులు ఇతర పనులకు ఆధార్ తప్పనిసరిగా అడుగుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఆధార్ కార్డు తప్పనిసరి. తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ఆధార్‌ ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. గతంలో ఆధార్ సేవా కేంద్రాల్లో మాత్రమే ఆధార్ నమోదు, అప్డేట్ చేసవారు ఇప్పుడు బ్యాంకులు, పోస్టాఫీసులు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రజలు తమ ఊరిలోనే ఆధార్ కార్డులను సులభంగా అప్డేట్ చేయించుకోవచ్చు.

ప్రవేశ, పోటీ పరీక్షలకు

నీట్‌ తో పాటు పలు పరీక్షలకు హాజరయ్యేవారు, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్‌ అప్డేట్‌ తప్పనిసరి. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్న కొద్దీ వారి వేలిముద్రలు, ఇతర బయోమెట్రిక్‌ వివరాలు అప్డేట్ చేయించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో 5 ఏళ్లు నిండిన వారికి తొలిసారి, 15 ఏళ్లు నిండిన విద్యార్థులు రెండోసారి అప్డేట్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Also Read: Investment In Ap: ఏపీలో మరో పెద్ద పెట్టుబడి.. గూగుల్ తర్వాత ఆ కంపెనీదే, మంత్రి లోకేష్ ప్రకటన

కొత్త ఛార్జీలు

అక్టోబర్ 1వ తేదీ నుంచి యూఐడీఏఐ ఆధార్‌ ఛార్జీలు పెంచింది. పేరు, పుట్టిన తేదీ వంటి డెమోగ్రఫిక్ వివరాలు మార్చుకోవడానికి గతంలో రూ.50 రుసుము ఉండగా ఇప్పుడు రూ.75లకు పెంచారు. డాక్యుమెంట్ అప్డేట్ కు రూ.50 నుంచి రూ.75 పెంచారు. బయోమెట్రిక్‌ అప్డేట్‌కు రూ.100 నుంచి రూ.125కు పెంచారు. ఆధార్ నమోదు, పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ మాత్రం ఉచితం.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×