BigTV English

Amaravati: రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు.. హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. రైతులకు షాక్..

Amaravati: రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు.. హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. రైతులకు షాక్..

Amaravati: ఏపీ రాజధాని రైతులకు హైకోర్టులో చుక్కెదురైంది. R5 జోన్‌లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయొద్దని రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. ఐతే.. ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని ధర్మాసనం ఆదేశించింది.


అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జీవో నెం.45పై రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌ కోర్టు కొట్టివేసింది. రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికో పరిమితం కాదని.. రాజధాని ప్రజలందరిదని.. రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా? అంటూ సీజే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమేనని కోర్టు అభిప్రాయపడింది. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్‌ కాదంది. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవేనని.. ఆ భూములు ఇప్పుడు రైతులవి కావని.. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.


హైకోర్టు తీర్పుతో ఒక్కో కుటుంబానికి సెంటు స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో.. 10 లేఅవుట్లలో 48 వేల మంది పేదలకు స్థలాలు పంపిణీ చేయనుంది. ఈ నెల 15 లోగా పట్టాల పంపిణీ పూర్తి చేసేలా కార్యచరణకు సిద్ధమవుతున్నారు అధికారులు.

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×