AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. దీంతో ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం వ్యాపారంలో భారీగా మనీలాండరింగ్, హవాలా సొమ్ము చేతులు మారినట్లు గుర్తించిన ఈడీ అధికారులు.. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
రాజ్ కసిరెడ్డి అరెస్టుకు ముందు ఈడీ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని దాదాపు పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రాజ్ కసిరెడ్డి నివాసం, ఆయనకు చెందిన కార్యాలయాలు, అలాగే ఈ స్కామ్తో సంబంధం ఉందనే అనుమానం ఉన్న మరికొందరు ముఖ్యుల ఇళ్లల్లో ఈడీ బృందాలు గాలించాయి. ఈ సోదాల్లో లభించిన కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాల బేస్గా రాజ్ కసిరెడ్డిని అధికారులు అరెస్టు చేశారు.
అనంతరం వైద్య చికిత్స నిమిత్తం ఈడీ కార్యాలయం నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈడీ కోర్టులోనూ ఆయన్ను ప్రవేశపెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కసిరెడ్డిని కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరనున్నారు. ఈడీ కోర్టు అనుమతి లభించిన వెంటనే మద్యం అక్రమ రవాణా, నిధుల మళ్లింపుపై ఆయన్ను సుదీర్ఘంగా ఈడీ ప్రశ్నించనుంది. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు తిమింగలాల గుట్టు విప్పేందుకు ఈ విచారణ అత్యంత కీలకం కానుంది.
Also Read: Smart Gadgets: ఇల్లు మీది.. పని వాటిది.. మీ శ్రమను తగ్గించే 5 స్మార్ట్ గ్యాడ్జెట్స్!
అయితే ఈ లిక్కర్ స్కామ్పై విజయవాడలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే లోతుగా విచారణ జరిపి నాలుగు వేర్వేరు ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. తాజాగా ఈడీ రంగంలోకి దిగడం, రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేయడంతో.. త్వరలోనే ఈ కేసులో తుది ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. రాజ్ కసిరెడ్డి అరెస్టు నేపథ్యంలో అందరి దృష్టి సహజంగానే మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మీదకు మళ్లింది. రాజ్ కసిరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా జగన్ కి కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.
Also Read: మీ ఫోన్ వర్షంలో తడిసిందా? ఈ 5 తప్పులు చేస్తే.. ఇక అంతే సంగతులు!