Oman Attack: ఒమన్ తీరంలో గత నాలుగు రోజుల క్రితం జరిగిన ఘోర సముద్ర దాడి దేశవ్యాప్తంగా అందరిని తీవ్ర విషాదానికి గురిచేసింది. జలాల్లో ప్రయాణిస్తున్న ఎంటి సెట్టెబెలో’ వాణిజ్య నౌకపై అమెరికా సైనిక దళాలు జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అటాక్ దాడి చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే..
అయితే ఈ దాడి ఘటనలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మృతుల్లో ఏపీకి చెందిన విశాఖ మెరైన్ చీఫ్ ఇంజినీర్ సురేశ్ పట్నాల మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఢిల్లీలోని ఆంధ్రాభవన్ అధికారులు ధ్రువీకరించారు. మరణించిన వ్యక్తి సురేష్ కు భార్య, 13, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒమన్ తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతం అయిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.
Also read: Kummara Protest: ఆలయ పూజారుల హక్కుల కోసం కుమ్మర్ల పోరాటం.. డిండి రహదారిపై భారీ ఆందోళన!
ఎంటీ సెట్టెబెల్లో అనే ఓ నౌక చమురుతో ప్రయాణిస్తుంది. దీనిని అమెరికా కమాండ్ మిలిటరీ, అమెరికా సెంట్రల్ కమాండ్ క్షిపణుతో కలిసి దాడి చేసింది. దాడి సమయంలో మోత్తం నౌకలో 28 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో 24 మంది భారతీయులు, ఇద్దరు విదేశియులు ఉన్నారు. అమెరికా దాడి చేసిన సమయంలో ముగ్గురు భారతీయ నావికులు మరణిచినట్టు కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ మరియు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా’ సంస్థ తెలిపింది.
Also read: Voter Revision: ఓటర్ల లిస్ట్ ప్రక్షాళన పై ప్రతిపక్షాల నీచ రాజకీయం.. రాంచందర్ రావు ఫైర్..!