Iduku Pillaiyar: తిరువణ్ణామలై గిరివల మార్గంలో ఉన్న ఇడుకు పిల్లయ్యార్ ఆలయంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్కు చెందిన భక్తుడు మణికుమార్ అనే వ్యక్తి అధిక శరీర బరువు కారణంగా ఇరుకైన మార్గంలోకి ప్రవేశించే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి మృతి చెందిన విషయం తెలిసింన విషయమే.. అయితే ఈ ఘటన మరువక ముందే ఏపీకి చెందిన మరో భక్తురాలికి చేదు అనుబవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళా భక్తురాలు కూడా ఇడుకు పిల్లయ్యార్ ఆలయంలోని ఇరుకైన మార్గంలో చిక్కుకుపోయింది. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెను గమినించి వెంటనే అప్రమత్తమై సురక్షితంగా బయటకు మహిళను లాగి రక్షించింది. దీంతో ఏపీ భక్తురాలికి తిరిగి జీవం పోసినంత పనైంది. లేదంటే ఎవరు చూడక పోతే గతంలో జరిగిన విధంగానే ఉపిరాడకుండా తమ ప్రాణాలను డేంజర్లో పడకుండా బైటపడింది. దీంతో భక్తురాలు ఉపిరి పీల్చుకున్నారు.
Also Read: NEET Protests: నీట్ లీక్ వివాదంతో కాంగ్రెస్ మైండ్ గేమ్.. నెక్ట్స్ ప్లాన్ అదేనట..?
ఈ సంఘటనల నేపథ్యంలో అధిక శరీర బరువు ఉన్నవారిని ఇడుకు పిల్లయ్యార్ ఆలయంలోని ఇరుకైన మార్గంలోకి అనుమతించవద్దని అక్కడి భక్తులు కోరుతున్నారు. దీంతో పాటుగా దీనిపై స్పష్టమైన హెచ్చరిక బోర్డులను హిందూ ధర్మార్ధ శాఖ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. లేదంటే తమ ప్రాణాలను కోల్పేయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వం ఈ సంఘటనపై స్పందించి దీనిపై చర్యలు తీసుకొవాలని కోరారు.
Also Read: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. సైబర్ కేటుగాళ్ల వలలో పడొద్దు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!