E-Paper
Advertisement

Nara Lokesh: విశాఖ.. అధికారుల మొద్దు నిద్ర, ప్రభుత్వాలు మారినా మారని తీరు.. మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు

Nara Lokesh: విశాఖ.. అధికారుల మొద్దు నిద్ర, ప్రభుత్వాలు మారినా మారని తీరు.. మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు
Advertisement

Nara Lokesh: ప్రభుత్వాలు మారినా అధికారులు మారలేదా? మొద్దు నిద్రను వీడడం లేదా? సీఎం చంద్రబాబు బాటలో మంత్రి లోకేష్ నడుస్తున్నారా? మునుపటి పాలనను చూస్తారని సీఎం చంద్రబాబు ఎందుకున్నారు? దాన్ని అక్షరాలా మంత్రి నారా లోకేష్ చేసి చూపిస్తున్నారా అవుననే సమాధానం వస్తోంది.

రెండురోజుల కిందట విశాఖ వెళ్లారు మంత్రి నారా లోకేష్. కోర్టు వ్యవహారం తర్వాత శనివారం ఉదయం తన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ద్వారకా నగర్‌లో ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయానికి వెళ్లారు. నార్మల్‌గా అయితే ఉదయం ఎనిమిది గంటలకు తెరవాల్సిన గ్రంథాలయం మూసి ఉంది. కాసేపు అక్కడే నిలబడిపోయారు. ఆ తర్వాత అధికారులతో మాట్లాడారు.

Advertisement

ALSO READ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన

9.45 గంటలకు వచ్చిన అధికారులు గ్రంథాలయాన్ని ఓపెన్ చేశారు. దీనిపై మంత్రి కాసింత అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ లైబ్రరీల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.

Advertisement

పనిలో పనిగా నెహ్రూ బజార్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి. అంగన్వాడీ బాలల కేంద్రాన్ని సందర్శించి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. పిల్లలతో కొద్దిసేపు సరదాగా గడిపారు. చిన్నారులకు చాక్లెట్లు పంచి వారితో కలిసి ఫోటోలు దిగారు. చిన్నారులకు అందిస్తున్న గుడ్లు, పౌష్టికాహారం సరఫరాపై సిబ్బంది నుంచి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.

 

Related News

బ్యాంకర్లపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో క్లాస్!

విజయనగరం జిల్లాలో విషాధం.. భర్త అంత్యక్రియలకు డబ్బుల్లేక భార్య కన్నీటిరోదన!

క్రెడిట్ కొట్టేస్తున్న చంద్రబాబు.. ఎస్వీ మ్యూజియం అసలు నిజాలివే! – భూమన కరుణాకర్ రెడ్డి

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

వెటర్నరీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవడంపై వైసీపీ విమర్శలు, రంగంలోకి దిగిన మంత్రి

జనసేన క్లారిటీ.. జగన్‌ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×