E-Paper
Advertisement

AP SSC Hall Tickets: ఏపీ టెన్త్ హాల్ టికెట్లు విడుదల.. విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ

AP SSC Hall Tickets: ఏపీ టెన్త్ హాల్ టికెట్లు విడుదల.. విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ
Advertisement

AP SSC Hall Tickets: ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు గురువారం విడుదల అయ్యాయి. మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.in నుంచి నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌తో పాటు, మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ (9552300009), పాఠశాల విద్యా శాఖ LEAP యాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మార్చి 2న హాల్ టికెట్ లింక్ యాక్టివేట్ చేసింది బోర్డు. అయితే ఆ తరువాత దాన్ని డీయాక్టివేట్ చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఈ వారంలో డౌన్‌లోడ్ అవకాశం కల్పించింది.

హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, విద్యార్థులకు అందించేందుకు పాఠశాల అధికారులకు ప్రత్యేక లాగిన్ వివరాలను బోర్డు అందించింది. పరీక్షలు ప్రారంభమయ్యే లోపు విద్యార్థులు అడ్మిట్ కార్డులను పొందాలని అధికారులు సూచించారు.

ఏపీ ఎస్ఎస్సీ హాల్ టికెట్ 2026…డౌన్‌లోడ్ ఇలా

Advertisement

1. పదో తరగతి అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in పై క్లిక్ చేయండి.
2.హోమ్‌పేజీలో “AP SSC Hall Ticket 2026” లింక్‌పై క్లిక్ చేయండి.
3. అవసరమైన లాగిన్ వివరాలను ఎంటర్ చేసి, క్యాప్చా ధృవీకరణ చేయండి.
4. హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
5. భవిష్యత్ ఉపయోగం కోసం హాల్ టికెట్ ను డౌన్‌లోడ్ చేసుకోండి.
6. అడ్మిట్ కార్డు లేకుండా పరీక్ష హాలులోకి అనుమతించరు.

ఏపీ ఎస్ఎస్సీ పరీక్ష తేదీలు

ఏపీ ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి. హాల్ టికెట్‌లో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, స్కూల్ పేరు, పరీక్షా కేంద్రం, సబ్జెక్టుల వారీగా షెడ్యూల్, ముఖ్యమైన సూచనలు ఉంటాయి. అభ్యర్థులు తమ వివరాలను తనిఖీ చేసుకుని, ఏదైనా తేడాలు కనిపిస్తే వెంటనే వారి పాఠశాల అధికారులకు తెలియజేయాలి.

Advertisement

Also Read:   ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి16 నుంచి ఎగ్జామ్స్

టెన్త్ విద్యార్థులకు ఉచిత ప్రయాణం

ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. హాల్‌ టికెట్‌ చూపిస్తే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

Related News

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Big Stories

Advertisement
×