BigTV English
Advertisement

AP Students: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 30వతేదీ వరకే గడువు.. మీరు అప్లై చేశారా!

AP Students: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 30వతేదీ వరకే గడువు.. మీరు అప్లై చేశారా!

AP Students: విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తుంటాయి. ఆ పథకాలను అందిపుచ్చుకొని విద్యార్థులు.. విద్యాపథంలో దూసుకెళ్తుంటారు. ఈదశలోనే ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.


2024-25 ఉపకార వేతనాలకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు ఈనెల 30వతేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలని, లేనియెడల ఈ పథకానికి విద్యార్థులు అర్హులుకారంటూ ప్రభుత్వం వెల్లడించింది.

ఏపీ ప్రభుత్వం ప్రతి ఏడాది సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా డిగ్రీ నుండి పీజీ వరకు విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉపకార వేతనాన్ని అందిస్తుంది. అది కూడా అన్ని రకములైన కోర్సులు తీసుకుంటున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు అర్హులు. ఈ నేపథ్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి రెన్యువల్ తో పాటు, నూతనంగా స్కాలర్ షిప్ కు దరఖాస్తులు చేసే వారికి కూడా అవకాశం కల్పించింది ప్రభుత్వం.


ఈ విషయాన్ని ఆయా కళాశాలల యాజమాన్యాలు గుర్తించి http://jnanabhumiv2.apcfss.in లో లాగిన్ కావాలని కోరారు. ఈ లాగిన్ ద్వారా విద్యార్థుల వివరాలు పూర్తి స్థాయిలో నమోదు చేయాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈనెల 30వ తేదీ లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. అలాగే అర్హత కలిగిన విద్యార్థులు కూడా ఈ విషయాన్ని గమనించి, తమ వివరాలు నమోదయ్యాయో లేదో కూడా సరిచూసుకోవాలన్నారు.

Also Read: YS Jagan – RGV: దర్శకుడు ఆర్జీవీకి జగన్ సపోర్ట్.. షాకిచ్చిన ప్రకాశం పోలీస్.. 25న విచారణకు రాకుంటే?

ఇలా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ పరిధిలోని గ్రామ సచివాలయం వద్దకు వెళ్లి ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ను కలిసి ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరెందుకు ఆలస్యం.. మీరు అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి.. అలాగే మీ సచివాలయాన్ని సందర్శించండి.

Related News

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Big Stories

×