E-Paper
Advertisement

YS Sharmila : నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా ‘రచ్చబండ’.. పాల్గొననున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల..

YS Sharmila : నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా ‘రచ్చబండ’.. పాల్గొననున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల..
YS Sharmila Latest news

YS Sharmila latest news(Andhra pradesh election news): ఏపీ ఎన్నికల్లో అధికారమే టార్గెట్‌గా కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిల దూకుడు పెంచారు. జగన్‌ పాలనపై వ్యతిరేకతను పెంచి ఓటర్లను తమవైపుకు తిప్పుకునే వ్యూహంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రాంను నేడు బాపట్ల నుంచి ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు షర్మిల. ఆ తర్వాత గురువారం తెనాలి నియోజకవర్గంలో ఉదయం 10 గంటలకు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరులో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు.

అలాగే 9న ఉదయం కొవ్వూరులో రచ్చబండ, సాయంత్రం 5 గంటలకు తునిలో బహిరంగ సభ, 10వ తేదీన ఉదయం నర్సీపట్నంలో రచ్చబండ , సాయంత్రం పాడేరులో బహిరంగ సభ, 11 న నగరిలో బహిరంగ సభలో పాల్గొంటారు.

APCC వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ అలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం షర్మిలకు భద్రత పెంచాలని మంగళవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు.

ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీమతి షర్మిల భద్రతను 4+4 నుంచి 1+1కి తగ్గించారని వారు ఆయనకు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆమె బహిరంగ సభలలో రాష్ట్ర ప్రజల బాధల గురించి వివిధ అంశాలలో గళం విప్పినందుకే ఈ చర్య తీసుకున్నారని తెలిపారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×