E-Paper
Advertisement

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
Advertisement

APCOB Recruitment 2026: ఏపీ బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు అదిరిపోయే గుడ్ న్యూస్. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ కేటగిరీలలో మొత్తం 338 పోస్టుల భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వయోపరిమితి, అర్హతలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యా అర్హతల విషయానికి వస్తే.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే పీజీ విద్యార్హత ఉన్నవారికి, అలాగే ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులు చదివిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు.

Advertisement

అప్లికేషన్ ఫీజు:
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 7వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 850 లేదా నోటిఫికేషన్ నిబంధనలకు లోబడి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీకి చెందితే ఫీజులో మినహాయింపు  ఉంటుంది.

ఎంపిక విధానం:
ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష ద్వారా జరుగుతుంది. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ సిలబస్ ప్రకారం రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ అవేర్‌నెస్‌పై ప్రశ్నలు ఉంటాయి.

Related News

అస్సాం ప్రజలకు అండగా ఏపీ.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు!

స్కూలుకు ఫుల్లుగా తాగొచ్చిన టీచర్.. స్కూల్‌లో ఏం చేశాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. యాక్టివ్ కేసుల సంఖ్య ఎంతో తెలుసా?

మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో కలకలం.. భర్త, అత్తమామలతో సహా 11 మందిపై మందిపై గృహ హింస కేసు

హోటల్ చట్నీలో బల్లి.. నిలదీస్తే యజమాని నిర్లక్ష్య సమాధానం, చివరికి ఏమైందంటే?

కోనసీమలో తీవ్ర విషాదం.. పంట కాల్వలో మునిగి ముగ్గురు మృతి!

ఏపీ ఓటర్ల జాబితాలో సంచలనం.. 44 లక్షల ఓట్లు గాయబ్? నేటి అర్ధరాత్రితో ‘సర్’ ప్రక్రియ క్లోజ్!

Big Stories

Advertisement
×