E-Paper
Advertisement

APJAC : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమబాట.. కార్యాచరణ ఇదే..!

APJAC : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమబాట.. కార్యాచరణ ఇదే..!
Advertisement

APJAC : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమబాట పడుతున్నారు. ఉద్యమ కార్యాచరణను ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. విజయవాడ రెవెన్యూ భవన్‌లో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు. ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.

మార్చి 9, 10 తేదీల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టనున్నారు. మార్చి 13, 14న కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో ఆందోళన చేపడతారు. మార్చి 15, 17, 20 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తారు. మార్చి 21 నుంచి వర్క్‌ రూల్‌ అమలు చేస్తారు. మార్చి 21 నుంచి సెల్‌ డౌన్‌ కార్యక్రమం చేపట్టి.. అన్ని ప్రభుత్వ యాప్‌లను బంద్‌ చేస్తారు. మార్చి 24న హెచ్ వోడీ కార్యాలయాల వద్ద ధర్నాలకు దిగుతారు.

Advertisement

మార్చి 27న కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఏప్రిల్ 1న .. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను, సమస్యల్లో ఉన్న ఉద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఏప్రిల్ 3న స్పందనలో వినతి పత్రాలు అందిస్తారు. ఏప్రిల్ 5న రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారు. ఆ సమయంలో మలిదశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మంత్రుల బృందంతో చాయ్‌ బిస్కెట్‌ చర్చలే జరిగాయి తప్ప వాటితో ఎలాంటి ఫలితం లేదన్నారు. ఫిబ్రవరి 13న సీఎస్‌కు 50 పేజీల వినతిపత్రం ఇచ్చామని బొప్పరాజు తెలిపారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఉద్యోగులు చట్టబద్ధంగా దాచుకున్న డబ్బును రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. జీతభత్యాలు సకాలంలో ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. చలో విజయవాడ నిర్వహించి ఏడాది గడిచినా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని తెలిపారు. జీతాలు సరిగా రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాలు సహకరించాలని కోరారు. ఉద్యోగ సంఘాలు కలిసి రావాలని బొప్పరాజు పిలుపునిచ్చారు.

Advertisement

Lokesh: ఎన్టీఆర్‌కు లోకేశ్ వెల్‌కమ్.. వ్యూహమా? రాజకీయమా?

Alekhya Reddy: కార్లలో నిద్రించిన రోజుల నుంచి.. నువ్వు ఒక వారియర్‌.. అలేఖ్య ఎమోషనల్‌ పోస్ట్‌

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×