E-Paper
Advertisement

Araku Tribals Protest: ఎకో టూరిజం మాకొద్దు! అరకులో ఉరితాళ్లతో గిరిజనుల నిరసన

Araku Tribals Protest: ఎకో టూరిజం మాకొద్దు! అరకులో ఉరితాళ్లతో గిరిజనుల నిరసన

Araku Tribals Protest: ఆంధ్రా ఊటి అరకులో గిరజనులు ఉరితాళ్లతో నిరసనలు తెలుపుతున్నారు. తమకు జీవనాధారమైన భూమిపై అటవీ శాఖ పెత్తనంపై తిరుగుబాటు చేస్తున్నారు. అరకు లోయలో మాడగడ వ్యూ పాయింట్ అందాలు, అక్కడ సంపదపై అటవీ శాఖ అధికారులు తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తుండడంపై.. గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాడగడ వ్యూ పాయుంట్ నుంచి చూస్తే మేఘాలు భూమి కింద ఉన్నట్లు కనిపిస్తుంటాయి.

అరకు వెళ్లే టూరిస్టులు ఖచ్చితంగా మాడ గడ వ్యూపాయింట్ సందర్శిస్తేనే.. పర్యటన పూర్తయినట్లు భావిస్తారు. అలాంటి చోటును అటవీ శాఖ తమ సొంత అంటోంది. అయితే పూర్వికుల నుండి వంశపార్యపరంగా అక్కడ ఉంటున్న ఆ భూమి మాదేనని గిరిజనులు అంటున్నారు. అటవీ రెవెన్యూ శాఖల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. గిరిజనులు ఉరితాళ్లతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆరు వందల కుటుంబాలకు జీవన ఆధారమైన మాడగడ వ్యూ పాయింట్ అటవీ శాఖ స్వాధీనం చేసుకుని.. కేవలం 15 మందికి ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారని గిరిజనులు వాపోతున్నారు.

అల్లూరి జిల్లా కలెక్టర్ స్పందించకపోతే మాడగడకు టూరిస్టులను రానివ్వమని గిరిజనులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని టూరిస్ట్ వాహనాలను అడ్డుకోవడంతో, పర్యాటక రంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read: తాగి డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులే సజ్జనార్ సంచలనం

గిరిజనుల డిమాండ్లు నెరవేరకపోతే, రోడ్డు మూసివేత, టూరిస్టుల అడ్డుకోవడం వంటి చర్యలు తీవ్రతరం అవుతాయని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

అరకు పర్యాటక ఆర్థిక వ్యవస్థలో మాడగడ కీలకం. ఏటా లక్షలాది మంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు. గిరిజనుల ఆందోళన కొనసాగితే, టూరిజం రంగం భారీగా నష్టపోనుంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక గిరిజనులతో చర్చలు జ

రపాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×