E-Paper
Advertisement

TTD – Asaduddin owaisi Issue : తిరుపతి.. మీ జాగీరా? – టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అసదుద్దీన్ ఫైర్

TTD – Asaduddin owaisi Issue : తిరుపతి.. మీ జాగీరా? – టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అసదుద్దీన్ ఫైర్
Advertisement

TTD – Asaduddin Owaisi Issue :

⦿ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అసదుద్దీన్ ఫైర్
⦿ అన్యమతస్తులను ఉద్యోగం నుంచి తొలగిస్తామన్న నాయడు
⦿ బీఆర్ నాయుడు వ్యాఖ్యలపై అసదుద్దీన్ మండిపాటు
⦿ తిరుపతిలో అన్యమతస్తులు ఉద్యోగం చేస్తే తప్పేంటి?
⦿ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకూ అవకాశం ఇవ్వాలన్న కేంద్రం
⦿ మాకో రూల్.. మీకో రూలా?
⦿ వక్ఫ్ బోర్డులలోనూ హిందువుల జోక్యం ఊరుకోం
⦿ ఇది లౌకిక రాజ్యం..మతాల పేరుతో విడదీస్తున్నారు

Advertisement

హైదరాబాద్, స్వేచ్ఛ : నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన టీటీడీ బోర్డ్ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో వివాదాస్పదంగా తయారయ్యాయి. పదవీ బాధ్యతలు చేపట్టగానే బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారాయి. తిరుమలలో విధులు నిర్వహిస్తున్న అన్యమతస్తులను తొలగిస్తామని.. వారికి వీఆర్ఎస్ ఇచ్చి పంపుతామని బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇకపై హిందువులకు మాత్రమే తిరుమలలో ఉద్యోగావకాశాలు అని వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో పూర్తిగా ప్రక్షాళన ఉండబోతోందని.. అన్యమతస్తుల విషయంలో ఇకపై కఠినంగా ఉంటామని.. బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం తీవ్రంగా స్పందించారు.

హిందూ పక్షపాతిలా..

Advertisement

తిరుల బోర్డులో పనిచేసే 24 మంది సభ్యులలో అందరూ హిందువులే ఉండాలని బీఆర్ నాయుడు మరీ హిందూ పక్షపాతిగా మాట్లాడుతున్నారని.. ఇన్నాళ్లుగా లేని రూల్స్ ఇప్పుడెందుకు పెట్టాల్సి వచ్చిందన్నారు. కేంద్రంలో బీజేపీ వెనక ఉండి ముస్లిం వ్యతిరేక చర్యలను ప్రోత్సహిస్తోందని అన్నారు. చంద్రబాబు కూడా కూటమిలో భాగస్వామి కావడంతో బీజేపీ చెప్పినట్లు చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు తాను ఖండిస్తున్నానని అన్నారు. వక్ఫ్ బోర్డు కు సంబంధించిన నియామకాలలో హిందువులు కూడా ఉండాలని కేంద్రం బిల్లును రూపొందించిందని అన్నారు. వక్ఫ్ కౌన్సిల్ లోనూ హిందువులకు స్థానం కల్పిస్తూ కేంద్రం బిల్లులు రూపొందించిందని.. అలాంటప్పుడు అందరూ ముస్లిములే ఉండాలని మేము కూడా డిమాండ్ చేయవలసి వస్తుందని అన్నారు.

ఇది లౌకిక రాజ్యం

రూల్స్ మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవడానికి కుదరదన్నారు. ఇది లౌకిక రాజ్యం అని అన్ని మతాలనూ గౌరవించాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని..అందుకు అనుగుణంగానే నిర్ణయాలు కూడా ఏకపక్షంగా తీసుకొంటున్నారని విమర్శించారు. మాకు కూడా హిందూ సంప్రదాయాలంటే గౌరవం ఉందని అన్నారు. కొత్తగా వచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రానికి ఏజెంట్ గా పనిచేస్తున్నారని..అన్యమతస్తుల డిక్లరేషన్ అంశం కూడా పునరాలోచించాలని అన్నారు. జాతీయ స్థాయి మీడియాకు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×