BigTV English
Advertisement

Chittoor: అల్లరి చేస్తోందని విద్యార్థిని పుర్రె పగలకొట్టిన టీచర్..

Chittoor: అల్లరి చేస్తోందని విద్యార్థిని పుర్రె పగలకొట్టిన టీచర్..

Chittoor: విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడం కామనే.. కానీ, చావబాదే ఘటనలే.. ఉపాధ్యాయుల మానసిక స్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ విద్యార్థినిని దండించే క్రమంలో ఉపాధ్యాయుడు తలపై కొడితే.. విద్యార్థిని తల పగిలింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.


క్లాస్‌రూమ్‌లో అల్లరి చేస్తోందని స్కూల్‌ బ్యాగ్‌తో.. బాలిక తలపై కొట్టిన హిందీ టీచర్‌..
పుంగనూరుకు చెందిన 11 ఏళ్ల సాత్విక నాగశ్రీ స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. క్లాస్‌ రూమ్‌లో అల్లరి చేస్తోందని ఆమె తలపై స్కూల్‌ బ్యాగ్‌తో కొట్టాడు హిందీ టీచర్‌. అదే స్కూల్లో బాలిక తల్లి విజేత పనిచేస్తోంది. అయితే, టీచర్‌ మాములుగానే దండించి ఉంటాడని భావించి లైట్‌ తీసుకుంది బాలిక తల్లి. మరుసటి రోజు నుంచి తలనొప్పిగా ఉందని మూడు రోజులుగా నాగశ్రీ పాఠశాలకు వెళ్లలేదు. దాంతో బాలికను పుంగనూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలికను పరీక్షించిన పుంగనూరు వైద్యులు.. బెంగళూరు వెళ్లాలని సూచించారు. బాలికను బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చూపించగా.. పుర్రె ఎముక చిట్లినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో స్కూల్‌ యాజమాన్యంపై విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మాములుగానే కొట్టి ఉంటాడనుకొని భావించిన బాలిక తల్లి
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన దారుణ ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆందోళన రేపింది. ఈ నెల 10వ తేదీన తరగతి గదిలో అల్లరి చేస్తోందని ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలిక సాత్విక నాగశ్రీని హిందీ ఉపాధ్యాయుడు స్కూల్ బ్యాగ్‌తో తలపై కొట్టాడు. అదే స్కూల్లో బాలిక తల్లి విజేత పనిచేస్తోంది. అయితే, టీచర్‌ మాములుగానే దండించి ఉంటాడని భావించి లైట్‌ తీసుకుంది బాలిక తల్లి. అయితే మరుసటి రోజు నుంచి తలనొప్పిగా ఉందని మూడు రోజులుగా నాగశ్రీ పాఠశాలకు వెళ్లలేదు.


బెంగళూరు తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించిన వైద్యులు..
దాంతో బాలికను పుంగనూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలికను పరీక్షించిన పుంగనూరు వైద్యులు.. బెంగళూరు వెళ్లాలని సూచించారు. బాలికను బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చూపించగా.. పుర్రె ఎముక చిట్లినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. సాత్విక నాగశ్రీ తల్లిదండ్రులు హరి, విజేతలకు.. వైద్యులు ఈ గాయం తీవ్రమైనది, శస్త్రచికిత్స అవసరమని తెలిపారు. బాలిక ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతోంది, కానీ పూర్తి రికవరీకి సమయం పడవచ్చు.

Also Read: దారుణం.. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

స్కూల్ యాజమాన్యంపై విద్యార్థిని తల్లి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు..
ఈ ఘటన జరిగిన తర్వాత బాలిక తల్లి, బంధువులు సోమవారం రాత్రి పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు నమోదు చేశారు. ఫిర్యాదులో, ఉపాధ్యాయుడు చట్టవిరుద్ధంగా శారీరక శిక్ష అమలు చేయడం, బాలికకు తీవ్ర గాయాలు కలిగించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఈ కేసును రిజిస్టర్ చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. పుంగనూరు ప్రాంతంలోని తల్లిదండ్రులు, విద్యార్థులు స్కూల్ మేనేజ్‌మెంట్‌పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Kashibugga: కాశీబుగ్గ దుర్ఘటన.. మృతుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్‌గ్రేషియా

Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే: మాజీ సీఎం జగన్

Parakamani: పరకామణి కేసులో ఊహించని ట్విస్టులు..

ISRO LVM3-M5 Mission: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్.. రేపు సాయంత్రం నింగిలోకి LVM3-M5

P.V.N. Madhav: మాధవ్ వన్‌మాన్ షో.. ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది?

CM Chandrababu: నిద్రలో కూడా ప్రజల గురించే ఆలోచిస్తా.. ఇదే నా విజన్: సీఎం చంద్రబాబు

Srikakulam News: కాశీబుగ్గ టెంపుల్ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంది.. ఘటనపై మంత్రి ఆనం స్పందన ఇదే..

Stampede At Kasibugga: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Big Stories

×