E-Paper
Advertisement

Kashibugga: కాశీబుగ్గ దుర్ఘటన.. మృతుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్‌గ్రేషియా

Kashibugga: కాశీబుగ్గ దుర్ఘటన.. మృతుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్‌గ్రేషియా
Advertisement

Kashibugga: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 15లక్షల ఎక్స్‌గ్రేషియో.. తీవ్ర గాయాలైన వారికి 3లక్షల పరిహారం.. చనిపోయిన వారి అంత్యక్రియలకు 10వేల రూపాయలు ఇస్తామన్నారు నారా లోకేష్. ఘటనపై విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక ఆలయం నాలుగు నెలల కిందటే ప్రారంభమైందని నారా లోకేష్ వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లా పలాసకు వెళ్లారు మంత్రి నారా లోకేష్. నేరుగా కాశీబుగ్గ ఆలయానికి వెళ్లి తొక్కిసలాట ప్రాంతాన్ని పరి శీలించారు. ప్రమాదం వివరాలను సంబంధిత అధికారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. లోకేష్‌తోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత కూడా కాశీబుగ్గ ఆలయాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

Advertisement

అనంతరం పలాస ఆసుపత్రికి చేరుకున్నారు నారా లోకేష్‌. ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షత గాత్రులను పరామర్శించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అండగా ఉంటామని బాధితులకు భరోసా కల్పించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు.

అంతకుముందు బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే గౌతు శిరీష.. హృదయ విదారక ఘటన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. కేంద్రం 2లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో ప్రకటించిందని చెప్పారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. మృతుల కుటుంబాలకు జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు గౌతు శిరీష.

Advertisement

మరోవైపు 12 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. బాధిత కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించా రు. కాశీబుగ్గ ఘటనలో 12 మంది చనిపోయారని.. 13 మంది గాయపడ్డారని కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అదేవిధంగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారిని శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. ఘటనలో గాయ పడ్డ వారికి పలాస ఆసుపత్రిలోనే చికిత్స కొనసాగుతోంది.

Related News

Koneti Adimulam: చంద్రబాబు కు షాక్.. ఆ ఎమ్మెల్యే గుడ్ బై?

Amaravati: నారాయణ ఔట్.. పెమ్మసాని ఇన్.. అమరావతిపై చంద్రబాబు కొత్త వ్యూహం

Banana Rate Fact Check: కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే.. వైఎస్ జగన్ విమర్శలకు ఫ్యాక్ట్ చెక్ ఏపీ పంచ్

AP Helicopter Politics: జగన్ విహారయాత్రకు రూ.222 కోట్ల ఖర్చు.. నిజం బయటపడిందంటూ మంత్రి లోకేష్ కౌంటర్

AP Govt: 16,666 ఎకరాల భూసమీకరణకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు.. ఇదిగో గ్రామాల జాబితా

School bus on fire: తప్పిన పెను ప్రమాదం.. డ్రైవర్, క్లీనర్ మధ్య గొడవ.. స్కూల్ బస్సుకు నిప్పు

Weather Update: ముంచుకొస్తున్న ముప్పు.. ఓవైపు వర్షం, మరోవైపు చలి.. తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం..

Eluru News: ఏలూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. అర్ధరాత్రి సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్

Big Stories

Advertisement
×