E-Paper
Advertisement

Avinash Reddy : సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు.. తండ్రితో కలిపి ప్రశ్నిస్తారా..?

Avinash Reddy : సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు.. తండ్రితో కలిపి ప్రశ్నిస్తారా..?
Advertisement

Avinash Reddy : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఐదోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఆయన కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. సీబీఐ నోటీసుల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో అవినాష్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై మంగళవారం విచారణ జరిగింది. ఆయన్ను ఈనెల 25 వరకు అరెస్ట్‌ చేయవద్దని సీబీఐను న్యాయస్థానం ఆదేశించింది.

అయితే అప్పటి వరకు సీబీఐ కార్యాలయంలో ప్రతి రోజూ విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి షరతు విధించింది. అవినాష్‌కు ప్రశ్నలను రాతపూర్వకంగా ఇవ్వాలని.. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని సీబీఐను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

మరోవైపు వివేకా హత్య కేసులో అరెస్టైన నిందితులు వైఎస్‌ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలించారు. అక్కడ వారిద్దర్నీ ప్రశ్నిస్తున్నారు.

భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై సీబీఐ న్యాయస్థానంలో మంగళవారం విచారణ జరిగింది. వారిని ఈ నెల 19 నుంచి 24 వరకు 6రోజులపాటు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కోసం చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది.

Advertisement

భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలతో కలిపి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఈ నెల 25న అవినాష్ రెడ్డి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.

Related News

టీటీడీలో భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న ఏసీబీ టీమ్

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Big Stories

Advertisement
×