Bandla Ganesh: ఎట్టకేలకు తిరుమలకు పాదయాత్ర మొదలుపెట్టారు నిర్మాత బండ్ల గణేశ్. సోమవారం ఉదయం షాద్నగర్లో తన ఇంటి నుంచి తిరుమలకు బయలుదేరారు. ఇది రాజకీయ యాత్ర కాదని, మొక్కుబడి చెల్లింపు కోసం మొదలుపెట్టిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ‘బిగ్ టీవీ’తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు.
నిర్మాత బండ్ల గణేష్ పాదయాత్ర మొదలు
నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఏదైనా ముక్కుసాటిగా మాట్లాడే తత్వం ఆయన సొంతం. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా అస్సలు పట్టించుకోరు. నిర్మాత అయినా కొందరు నాయకులంటే ఆయన విపరీతమైన అభిమానం. అందుకోసం ఆయన ఏమైనా చేస్తుంటారు కూడా.
ఓ కేసులో వైసీపీ ప్రభుత్వం మాజీ సీఎం చంద్రబాబుని అరెస్టు చేసింది. ఆ సమయంలో చంద్రబాబు అభిమానులు బాధపడ్డారు. అలాంటివారిలో బండ్ల గణేష్ కూడా ఒకరు. ఈ కేసులో జైలు నుంచి చంద్రబాబు బయటికి వస్తే తిరుమలకు నడిచి వస్తానని వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నారు. ఇప్పుడు ఆ మొక్కును తీర్చే పనిలోపడ్డారు.
షాద్నగర్ నుంచి తిరుమల వరకు
ఈ క్రమంలో సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నుంచి ఆయన తిరుమలకు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ‘బిగ్ టీవీ’ ఆయన్ని పలకరించింది. చంద్రబాబు అరెస్టు సమయంలో తాను మొక్కుకున్న మొక్కని అది తీర్చుకునేందుకు బయలు దేరినట్టు చెప్పారు. కేవలం సంకల్పయాత్ర మాత్రమేనని, 20 రోజుల్లో తిరుమలకు పాదయాత్ర పూర్తి చేస్తానని చెప్పకనే చెప్పారు.
దేశంలో అత్యంత గొప్ప నాయకుల్లో చంద్రబాబు ఒకరని అన్నారు గణేష్. చంద్రబాబు బెయిల్ విషయంలో రెండుసార్లు తాను సుప్రీంకోర్టుకు హాజరైనట్టు వివరించారు. ఈ కేసు తాను విచారించలేనని న్యాయమూర్తి చెప్పడంతో న్యాయస్థానం నుంచి బయటకు వచ్చానన్నారు. ఆ సమయంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నానని తెలిపారు.
ALSO READ: ఏపీ లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్రెడ్డికి ఈడీ నోటీసులు
తన ఇంటి నుంచి తిరుమలకు కాలినడకన వస్తానని మొక్కుకున్నట్లు తెలియజేశారు. తాను మొక్కిన నాలుగు రోజులకు అభిమాన నేతకు బెయిల్ వచ్చిందన్నారు. గతవారం ఆ కేసుని న్యాయస్థానం పూర్తిగా కొట్టి వేసిందన్నారు. కేసు క్లోజ్ అయినా మొక్కు ఆపడం తప్పని భావించి పాదయాత్ర మొదలు పెట్టినట్టు మనసులోని మాట బయటపెట్టారు.
20 రోజుల్లో తిరుమలకు పాదయాత్ర పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. కేవలం దైవకార్యక్రమం మాత్రమేనని తెలిపారు. దీనికి సంకల్పయాత్ర అని ఆయన నామకరణం చేసుకున్నారు. మూడువారాల తర్వాత బండ్ల గణేష్ తిరుమలకు చేరుకోనున్నారు.
బిగ్ టీవీతో బండ్ల గణేష్
ఈ దేశంలోనే అత్యంత గొప్ప నాయకుల్లో చంద్రబాబు ఒకరు
అలాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఎంతో బాధపడ్డాను
జైలు నుంచి చంద్రబాబు బయటికి వస్తే తిరుమలకు నడిచి వస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను
మొక్కిన నాలుగు రోజులకే చంద్రబాబుకి బెయిల్ వచ్చి… pic.twitter.com/f2oQR90Aci
— BIG TV Breaking News (@bigtvtelugu) January 19, 2026