E-Paper
Advertisement

Botsa Satyanarayana: బొత్స సత్యనారాయణకు మళ్ళీ అస్వస్థత.. అసలు ఏమైంది?

Botsa Satyanarayana: బొత్స సత్యనారాయణకు మళ్ళీ అస్వస్థత.. అసలు ఏమైంది?
Advertisement

Botsa Satyanarayana:  వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి , ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో పాల్గొన్న ఆయన సభలో మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు లోనై తూలిపడబోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వెంటనే అప్రమత్తమై బొత్సను పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న అసెంబ్లీ వర్గాలు హుటాహుటిన వైద్యులను రప్పించాయి. బొత్స ఛాంబర్‌లో ఆయనకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా.. బీపీ సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థాయిలో బీపీలో హెచ్చుతగ్గులు రావడం వల్లే ఆయనకు కళ్లు తిరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

Advertisement

బొత్స సత్యనారాయణ గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది.. కోలుకున్న తర్వాతే మండలి సమావేశాలకు హాజరయ్యారు. తాజా ఘటన నేపథ్యంలో సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారు. బీపీ నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు బొత్స సత్యనారాయణ సభ నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. తీవ్రమైన రాజకీయ ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం వల్ల ఇలాంటి హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉందని.. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని వైద్యులు తెలిపారు.

Also Read:రేపే ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన.. సీఎం‌తోపాటు కేంద్రమంత్రులు రాక

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×