E-Paper
Advertisement

Anakapalli: నేడు ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన.. మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు

Anakapalli: నేడు ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన.. మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు

Anakapalli: ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఆర్సెలార్ మిత్తల్-నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు అంతా రెడీ అయ్యింది. సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సీఎం చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.

అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన

ఉత్తరాంధ్రకు తలమానికంగా మారనున్న ఆర్సెలార్ మిత్తల్-నిప్పాన్ కంపెనీల ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సోమవారం శంకుస్థాపన జరగనుంది. రెండు దశల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌ కోసం మొత్తం 5,465 ఎకరాలు కేటాయించారు. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

మొదటి దశ-7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశ-10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి చేయనున్నాయి ఆ సంస్థలు. ఇందుకోసం లక్షా 35 వేల 964 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది.

సీఎం‌ చంద్రబాబుతోపాటు పలువురు కేంద్రమంత్రులు రాక

ఈ స్టీల్‌ప్లాంట్‌కు అనుబంధంగా మరో 316 ఎకరాల్లో క్యాప్టివ్ పోర్టును ఏఎంఎన్​ఎస్ ఇండియా ఏర్పాటు చేయనుంది. అందుకోసం ప్రత్యేకంగా రూ. 11,198 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా మరో 6,000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ప్లాంట్ ఏర్పాటుతో విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిశ్రమల హబ్‌గా మారనుంది.

స్టీల్‌ప్లాంట్‌కు జాతీయ రహదారి-16తో అనుసంధానం చేసేలా నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. కనెక్టివిటీ పెంచడం, పరిశ్రమకు అవసరమయ్యే నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించింది. ఇప్పటికే స్టీల్‌ప్లాంట్ శంకుస్థాపన చేయనున్న ప్రాంతాన్ని పలుమార్లు పరిశీలించారు హోం మంత్రి అనిత.

ALSO READ: గరికపాటి గుడ్డు పంచాయితీ.. చివాట్లు తినడానికి కాకపోతే.. అవసరమా మీకిది పెద్దాయన!

సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్, పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. సోమవారం కార్యక్రమానికి వేదికను సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు రానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాదు శంకుస్థాపన చేసే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

2024 ఆగస్టులో మంత్రి లోకేశ్‌.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఆర్సెలార్‌ మిత్తల్‌ సంస్థతో చర్చించారు. కేవలం మూడు నెలల్లో ప్రభుత్వం భూమి కేటాయించింది. భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఉక్కు కర్మాగారానికి కేవలం 14 నెలల్లో అన్ని అనుమతులూ వచ్చేలా చేసింది. ఫలితంగా శంకుస్థాపనకు సిద్ధమైంది.

 

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×