E-Paper
Advertisement

Brahmamgari Matham: కొలిక్కివచ్చిన వివాదం.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

Brahmamgari Matham: కొలిక్కివచ్చిన వివాదం.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి
Advertisement

Brahmamgari Matham: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ , ప్రభుత్వం నియమించింది. ఎన్నో వివాదాల అనంతరం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా నియమించడంతో మఠంలో భక్తుల సంబరాలు చేసుకుంటున్నారు. గత నాలుగేళ్లుగా పీఠాధిపతి పదవి కోసం వివాదం నెలకొంది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య నాలుగేళ్లుగా ఈ వివాదం సాగింది. చివరికి మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం పీఠాధిపతిగా ధార్మిక పరిషత్ నిర్ణయించింది.

2021 నుంచి వివాదం

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వ్యవహారంపై నాలుగేళ్లుగా వివాదం కొనసాగింది. 2021 మే 8న బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి అనారోగ్యంతో శివైక్యం చెందారు. అనంతరం నొస్సం వెంకటాద్రిస్వామి పీఠాధిపతిగా, ఉత్తరాధికారిగా వీరభద్రస్వామి, వీరి తర్వాత నొస్సం గోవిందస్వామికి అవకాశం ఇచ్చేలా నిర్ణయించారు. అయితే వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి మొదటి, రెండో భార్య కుమారుల మధ్య పీఠాధిపత్యానికి కోసం పోటీ మొదలైంది.

హైకోర్టులో పిటిషన్

Advertisement

అప్పట్లో ఈ వ్యవహారంపై దేవాదాయశాఖ మంత్రి కూడా జోక్యంచేసుకుని కుటుంబ సభ్యులతో చర్చించారు. అయినా వ్యవహారం తేలలేదు. అయితే అప్పటి ఎమ్మెల్యే వీరభోగవసంత వేంకటేశ్వరస్వామి మొదటి, రెండో భార్య కుమారులతో చర్చించారు. సమస్య పరిష్కారం అయిందనుకున్న సమయంలో పూర్వ పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు కొట్టివేసింది. తాజాగా ఈ వివాదం కొలిక్కి వచ్చింది. బ్రహ్మం గారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని ధార్మిక పరిషత్ నిర్ణయించింది.
Also Read: ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక.. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు క్లియర్

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×