E-Paper
Advertisement

Break down of floating bridge: ఆదివారం ప్రారంభం.. సోమవారానికే తెగిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్..

Break down of floating bridge: ఆదివారం ప్రారంభం.. సోమవారానికే తెగిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్..
Advertisement

floating bridge in vizag

Break down of floating bridge in vizag(Local news andhra Pradesh): విశాఖ ఆర్కే బీచ్‌లో ఆదివారం ప్రారంభించిన తేలే వంతెన సోమవారానికే తెగిపోవడం గమనార్హం. వంతెన చివరి భాగం తెగిపోయి 100 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. దీంతో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. ఇప్పుడు పర్యాటకులు ఫ్లోటింగ్‌ బ్రిడ్జిను ఎక్కాలంటే భయపడే పరిస్థితులు ఏర్పాడాయి.

Advertisement

ఈ ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ను ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ బ్రిడ్డ్‌ను మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, పైసీపీ రాజ్యసభ ఎంపీ సుబ్బారెడ్డి కలిసి వైఎంసీఏ సమీపంలో ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్‌కు సుమారు రూ. కోటీ 60 లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ నిర్మాణాన్ని విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ సంస్థ నిర్మించింది.

ఈ బ్రిడ్జి నిర్మాణం జనవరి మొదటి వారంలో మొదలు పెట్టి ఫిబ్రవరి చివరికి అంటే కేవలం 45 నుంచి 50 రోజుల్లో పూర్తి చేశారు. ప్రాంభించిన రెండో రోజుకే తెగిపోవటంతో విమర్శలు గుప్పిస్తున్నారు. బీచ్‌ను సందర్శించేందుకు వచ్చిన పర్యటకులు సైతం భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని అధికారులపై మండిపడుతున్నారు.

Advertisement

Read More: Kolusu Parthasarathy : టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. నూజివీడులో విజయంపై ధీమా..

ఈ బ్రిడ్జి నిర్మాణ దశలో ఉన్నప్పుడే నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా నిర్మించారు. ఈ బ్రిడ్జి తెగిపోయి 100 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. ఈ సమయంలో అక్కడ పర్యటకులు ఎక్కువగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అలల తీవ్రత ఎక్కువ ఉన్న బీచ్‌లో తేలియాడే ఫోటింగ్‌ బ్రిడ్జిలు నిర్మించడం సరి కాదు అని నిపుణులు అంటున్నారు.

Tags

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×