E-Paper
Advertisement

Nara Lokesh Australia Visit: ఏపీ క్లస్టర్‌లలో ఆస్ట్రేలియా పెట్టుబడుల కోసం.. మంత్రి లోకేష్ విజ్ఞప్తి

Nara Lokesh Australia Visit: ఏపీ క్లస్టర్‌లలో ఆస్ట్రేలియా పెట్టుబడుల కోసం.. మంత్రి లోకేష్ విజ్ఞప్తి
Advertisement

Nara Lokesh Australia Visit: విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. సిడ్నీలో ఆయన ఆస్ట్రేలియా–ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ మెక్‌కే తో భేటీ అయ్యి, ఇరు దేశాల వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు.

ఈ సమావేశంలో మంత్రి లోకేష్, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. మంత్రి మాట్లాడుతూ.. ఏపీఈడీబీ, సీఐఐ, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించే ఆస్ట్రేలియా-ఏపీ సీఈవో రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలోని కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకారం అందించాలని కోరారు. నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్టనర్ షిప్ సమ్మిట్ – 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలసి హాజరుకావాల్సిందిగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు.

Advertisement

ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఇండస్ట్రియల్ క్లస్టర్‌లలో.. పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా కంపెనీలకు సహకరించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. ఆస్ట్రేలియా–ఇండియా స్టేట్ ఎంగేజ్‌మెంట్ ఎజెండాలో ఆంధ్రప్రదేశ్‌ను చేర్చాలని లోకేష్ కోరారు. ఆస్ట్రేలియాతో విద్య, ఐటీ, నూతన సాంకేతిక రంగాల్లో మరిన్ని  కార్యక్రమాలు చేపట్టేలా ప్రత్యేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే  ఉంది. ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, గ్రీన్ టెక్నాలజీల్లో ఆస్ట్రేలియా నైపుణ్యం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు.

పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లోని కార్యక్రమంలో.. తెలుగువారితో కూడా సమావేశమయ్యారు. అక్కడ వారు రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ప్రవాస తెలుగువారి అనుభవం, నెట్‌వర్క్ రాష్ట్రానికి మేలును చేకూరుస్తుంది. మీరు రాష్ట్రానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలి అని మంత్రి తెలిపారు. సాంకేతిక రంగంలో పనిచేస్తున్న ప్రవాసులు ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్‌లు స్థాపించాలని కోరారు.

Advertisement

Also Read: పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమ ఒప్పందం

సీఈవో ఫోరం డైరెక్టర్ మెక్‌కే మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నందుకు ప్రశంసలు తెలిపారు. ఐటీ, విద్యా రంగాల్లో ఆస్ట్రేలియా కంపెనీలు భాగస్వామ్యం చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి అని ఆయన పేర్కొన్నారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×