BigTV English
Advertisement

Budameru Vagu: వెళ్లొద్దు అని మొత్తుకున్న వినకుండా.. వరదలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు

Budameru Vagu: వెళ్లొద్దు అని మొత్తుకున్న వినకుండా.. వరదలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు

Software Employee missing in Budameru Vagu: విజయవాడలో మరోసారి భారీ వర్షం కురిసింది. ఇప్పటికే బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. మూడు గండ్లను మూసివేయడంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం నిలిచిపోయింది. అయితే రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు చోట్లు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా, ఈ వరదలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతయ్యాడు.


వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన కలిదింవి ఫణికుమార్ హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం వినాయక చవితి పండగ కావడంతో ఇంటికి వెళ్లాడు. ఉదయం గన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అనంతరం సాయంత్రం తిరిగి మళ్లీ మచిలీపట్నం వెళ్తానని చెప్పడంతో బంధువులు వద్దని కోరారు.

అయితే, వర్షాలు పడుతున్నందున మచిలీపట్నంకు వెళ్లవద్దని ఎంత చెప్పినప్పటికీ వినకుండా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అయితే మార్గమధ్యలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోందని, విజయవాడ మీదుగా వెళ్లాలని స్థానికులు చెప్పినా వినిపించుకోలేదు. అలాగేే వేగంగా వెళ్లినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.


స్థానికులు సైతం వరద వస్తుందని చెప్పినా కేసరపల్లి, ఉప్పులూరు, కంకిపాడు మీదుగా వెళ్తానంటూ తన కారులో దూసుకెళ్లాడు. చివరికి బుడమేరు వాగు వరద నీటిలో చిక్కుకుపోయాడు. అతడిని బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులతోపాటు పోలీసులు ప్రయత్నించారు. చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. కాగా, ఓ చోట నీటిలో మునిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కారును పోలీసులు గుర్తించారు.

మరోవైపు సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది.

Also Read: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు పడ్డాయి. అయితే ఈ అల్పపీడనం కాస్తా బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరంవైపు కదులుతోంది. రానున్న 24 గంటల్లో వాయువగుండంగా మారనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×