E-Paper
Advertisement

Bus Accident : పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు..

Bus Accident : పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు..
Advertisement

Bus Accident : అల్లూరి జిల్లాలోని పాడేరు ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాడేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఘాట్‌ రోడ్డు వ్యూ పాయింట్‌ వద్ద అదుపు తప్పింది.
లోయలోకి దూసుకుపోయింది. ఏడు పల్టీలు కొట్టి.. 50 అడుగుల లోయలోకి బస్సు పడిపోయింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. వారిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కూడా ఉన్నారు. ఈ బస్సు విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది.

Advertisement

లోయలో పడిన బస్సు వద్దకు స్థానికులు వెంటనే చేరుకున్నారు. క్షతగాత్రులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బాధితులను అతి కష్టం మీద ప్రధాన రహదారిపైకి తీసుకొచ్చారు. పాడేరు వైపు నుంచి వచ్చిన మరో ఆర్టీసీ బస్సులో వారిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు అక్కడే చికిత్స అందిస్తున్నారు.

ఇటీవల కురిసిన వర్షాల వల్ల చెట్టు కొమ్మలు రోడ్డుపైకి వాలిపోయాయి. రహదారి పక్కన రక్షణ గోడలేదు. ఇదే ప్రమాదానికి కారణమని బాధితులు అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ కూడా సరిగా లేవు. దీంతో ప్రయాణికులు ప్రమాద సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

పాడేరు ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్‌ విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని నిర్దేశించారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×